5G Service | హైదరాబాద్, ఫిబ్రవరి 16: టెలికం దిగ్గజం రిలయన్స్ జియో..రాష్ట్రంలో 5జీ సేవలను మరింత విస్తరించింది. ఇప్పటికే ఎనిమిది నగరాల్లో ఈ 5జీ సేవలను ప్రారంభించిన సంస్థ..తాజాగా రామగుండం, మంచిర్యాలలో కూడా ఈ సేవలను ప్రారంభించింది. దీంతో రాష్ట్రంలో 5జీ సేవలు అందిస్తున్న నగరాల సంఖ్య 10కి చేరుకున్నది. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ మినహా మిగతా నగరాల్లో 5జీ సేవలు అందిస్తున్నది జియో కావడం విశేషం.