ముంబై: ఇజ్రాయెల్పై పాలస్తీనాలోని హమాస్ సంస్థ భీకర దాడులు చేయడం.. అందుకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ యుద్ధం ప్రకటించి ప్రతి దాడులకు దిగడం స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. హమాస్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నేపథ్యంలో సోమవారం ట్రేడింగ్ ప్రారంభం నుంచే మార్కెట్లు నష్టాలను చవిచూశాయి. చివరికి 483 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్ 65,512 పాయింట్ల దగ్గర స్థిరపడింది.
దాంతో ఇన్వెస్టర్లు భారీగా నష్టపోయారు. దాదాపు రూ.4 లక్షల కోట్లకు పైగా మదుపరులు తమ సంపదను కోల్పోవాల్సి వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగడం కూడా మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపింది. ఈ ప్రతికూలతల కారణంగా నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ కూడా ఇవాళ 141 పాయింట్లు నష్టపోయి 19,512 పాయింట్ల దగ్గర ముగిసింది. ఐటీ మినహా అన్ని సెక్టోరియల్ సూచీలు నష్టాలను చవిచూశాయి.