న్యూఢిల్లీ, డిసెంబర్ 16: దేశీయ స్టాక్ మార్కెట్లు కోలుకోవడం లేదు. గురువారం నాటి భారీ నష్టాలు కొనసాగాయి. ఫలితంగా రెండు రోజుల్లో మదుపరుల సంపద ఏకంగా రూ.5.78 లక్షల కోట్లు కరిగిపోయింది. శుక్రవారం బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 461.22 పాయింట్లు లేదా 0.75 శాతం క్షీణించి 61,337.81 వద్ద ముగిసింది. అంతకుముందు రోజు 843.86 పాయింట్లు పడిపోయిన విషయం తెలిసిందే. దీంతో గురు, శుక్రవారాల్లో సెన్సెక్స్ 1,340.1 పాయింట్లు లేదా 2.13 శాతం దిగినైట్టెంది. మిడ్క్యాప్ సూచీ 2.49 శాతం, స్మాల్క్యాప్ సూచీ 1.57 శాతం నష్టపోయాయి. ఈ క్రమంలోనే బీఎస్ఈ నమోదిత కంపెనీల విలువ రూ.5,78,648.39 కోట్లు ఆవిరై రూ.2,85,46,359.06 కోట్లకు తగ్గింది. ఇక నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ సైతం 145.9 పాయింట్లు లేదా 0.79 శాతం పతనమై 18,269 వద్ద నిలిచింది. గురువారం 227.6 పాయింట్లు కోల్పోయిన సంగతి విదితమే.
రెడ్డీస్ షేర్ విలువ అత్యధికంగా 3.62 శాతం కోల్పోయింది. అలాగే మహీంద్రా అండ్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్, టీసీఎస్, ఎస్బీఐ, టైటాన్, పవర్గ్రిడ్, విప్రో షేర్లూ పెద్ద ఎత్తున నష్టాలను చవిచూశాయి.