న్యూఢిల్లీ, ఆగస్టు 23: వరుసగా కొన్ని నెలలుగా పెట్టుబడులను ఆకట్టుకున్న గోల్డ్ ఈటీఎఫ్లు మళ్లి వెలవెలబోతున్నాయి. దేశీయ ఈక్విటీ మార్కెట్లు రాకెట్ వేగంతో దూసుకుపోతుండటంతో పెట్టుబడిదారులు తమ నిధులను వీటివైపు మళ్లిస్తున్నారు. దీంతో గోల్డ్ ఈటీఎఫ్లు వెలవెలబోతున్నాయి. జూలై నెలలో గోల్డ్ ఈటీఎఫ్ల నుంచి 61 కోట్ల రూపాయలను వెనక్కితీసుకున్నారు. గోల్డ్ ఈటీఎఫ్ల కంటే ఈక్విటీ, డెబిట్ ఫండ్లు అత్యధిక రాబడిని ఇస్తుండటం ఇందుకు కారణమని అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా(ఆంఫీ) విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. నిధులు వెనక్కి తీసుకున్నప్పటికీ ఫోలియో సభ్యుల సంఖ్య మాత్రం 18.32 లక్షల నుంచి 19.13 లక్షలకు పెరుగడం విశేషం. ఆగస్టు 2019 నుంచి ఇప్పటి వరకు మూడు నెలలు మాత్రమే నిధులు వెనక్కితీసుకోగా..మిగతా నెలల్లో మాత్రం ఇన్వెస్టర్లు అధిక నిధులు పంచారు. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో రూ.3,107 కోట్ల పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టమర్లు..ఆ మరుసటి నెలలోనే ఉపసంహరించుకోవడం విశేషం.