బెంగళూర్ : హైబ్రిడ్ ఫస్ట్ మోడల్ కొనసాగిస్తుండటంతో ఇంటెల్ (Intel) తన బెంగళూర్ కార్యాలయాన్ని విక్రయించేందుకు సన్నద్ధమైంది. ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్లోని 2.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన కార్యాలయాన్ని అమ్మేందుకు ఇంటెల్ ఇప్పటికే బిడ్డింగ్ ప్రక్రియను చేపట్టిందని ఓ వాణిజ్య పత్రిక వెల్లడించింది. ప్రముఖ బిడ్డర్లు తమ బిడ్స్ను దాఖలు చేశారని రూ. 450 కోట్లు పైగా ఈ డీల్ విలువ ఉంటుందని ఆ రిపోర్ట్ అంచనా వేసింది.
విక్రయ ప్రక్రియ పూర్తయిన అనంతరం నూతన యజమానులలో లీజు ఒప్పందం చేసుకుని అదే లొకేషన్ నుంచి పనిచేస్తుందని సమాచారం. ఆఫీసు స్ధలాన్ని ఇంటెల్ మూడేండ్ల పాటు లీజుకు తీసుకునే అవకాశం ఉంది. హైబ్రిడ్ మోడల్ను కొనసాగిస్తున్నందున ఈ స్పేస్ను తాము సమర్ధంగా వినియోగించుకోగలమని, వ్యయ నియంత్రణ కూడా అనుకూలాంశం కానుందని ఇంటెల్ వర్గాలు పేర్కొన్నాయి.
బెంగళూర్ ఇంటెల్కు కీలక డిజైన్, ఇంజనీరింగ్ సెంటర్ కాగా ఈ ప్రాంతం నుంచే దాదాపు 14,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 2021లో కొవిడ్-19 వ్యాప్తితో ఇంటెల్ తొలిసారిగా హైబ్రిడ్-ఫస్ట్ మోడల్ను అనుసరించింది. ప్రపంచవ్యాప్తంగా తమ ఉద్యోగుల్లో 90 శాతం మంది హైబ్రిడ్ వర్క్ప్లేస్నే కోరుకుంటారని అప్పట్లో ఇంటెల్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ క్రిస్టీ పంబియన్చి చెప్పుకొచ్చారు.
Read More :
Aman gupta | ఐదు కంపెనీలు పెట్టి చేతులు కాల్చుకున్నాడు.. ఆరో కంపెనీతో వందల కోట్లు సంపాదించాడు