AI : 2022 నవంబర్లో చాట్జీపీటీని ఓపెన్ఏఐ లాంఛ్ చేసినప్పటి నుంచి జనరేటివ్ ఏఐ పట్ల టెక్ ప్రపంచంలో హాట్ డిబేట్ సాగుతోంది. ఈ టెక్నాలజీ ప్రజల జీవితాలను మెరుగుపరుస్తుందని, ఉత్పాదకత పెరుగుతుందని కొందరు చెబుతుండగా, న్యూ టెక్నాలజీతో ఉద్యోగాలు కనుమరుగవుతాయని మరికొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఇన్ఫోసిస్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ జనరేటివ్ ఏఐ ప్రభావంపై బాంబు పేల్చారు. ఈ టెక్నాలజీతో మనుషులు చేసే ఉద్యోగాలపై వేటు తప్పదని ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐ రాకతో భవిష్యత్లో కంపెనీలు తక్కువ సంఖ్యలో ఉద్యోగులను నియమించుకుంటాయని చెప్పారు. జనరేటివ్ ఏఐ వంటి న్యూ టెక్నాలజీస్తో రాబోయే రోజుల్లో కంపెనీలకు కొద్దిమంది ఉద్యోగులు సరిపోతారని, ఫలితంగా హైరింగ్ కుచించుకుపోతుందని ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, కో హెడ్ (డెలివరీ) సతీష్ హెచ్సీ చెప్పారు.
మూడు నుంచి ఐదేండ్లలో క్రమంగా ఈ పరిస్ధితి నెలకొంటుందని అన్నారు. జనరేటివ్ ఏఐ వంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ను వినియోగించడం ప్రారంభిస్తుండటంతో అవి మరింత మెరుగైన సంస్ధలుగా ఎదుగుతాయని, ఫలితంగా సంప్రదాయ ఉద్యోగాల అవసరం వాటికి ఏమాత్రం ఉండదని స్పష్టం చేశారు. ఏఐతో కొలువుల కోత తప్పదనే ఆందోళన నడుమ స్వీడిష్ ఫిన్టెక్ కంపెనీ క్లార్నా 700 మంది ఉద్యోగులను తొలగించింది. ఏఐతో ఈ ఉద్యోగాలను రీప్లేస్ చేశామని కంపెనీ వెల్లడించింది.
Read More :