Cognizant | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: టీసీఎస్ బాటలోనే కాగ్నిజెంట్ పయనించింది. వర్క్ ఫ్రం హోంకు స్వస్తి పలుకుతున్నట్లు, ఇక నుంచి వారానికి మూడు రోజులు ఆఫీస్కు రావాల్సిందేనని ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించి ఉద్యోగులకు ఈ-మెయిల్ ద్వారా సమాచారం అందించారు కంపెనీ సీఈవో రవి కుమార్. అమెరికా ప్రధాన కేంద్రంగా ఐటీ సేవలు అందిస్తున్న కాగ్నిజెంట్కు..భారత్లోనే అతిపెద్ద కార్యాలయాలు, ఉద్యోగులు కలిగివున్నది. వారానికి మూడు రోజులు ఆఫీస్కు రావాలని తెలిపింది. కంపెనీకి భారత్లో 2.45 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు.