న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12: దేశంలో పారిశ్రామిక ఉత్పత్తి తిరిగి కుంచించుకుపోయింది. జూలై నెలలో పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) నాలుగు నెలల కనిష్ఠస్థాయి 2.4 శాతానికి పడిపోయింది. మేక్ ఇన్ ఇండియా అంటూ ఊదరగొట్టిన మోదీ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోవడంతో తయారీ రంగం, దానికి అనుసంధానమైన విద్యుత్, మైనింగ్ రంగాలు దెబ్బతిన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో 6.7 శాతం, మే నెలలో 19.6 శాతం, జూన్ నెలలో 12.7 శాతం చొప్పున వృద్ధిని కనపర్చిన ఐఐపీ జూలైలో ఒక్కసారిగా పతనంకావడం గమనార్హం. 2021 జూలైలో ఐఐపీ 11.5 శాతం వృద్ధిచెందింది. కేంద్ర గణాంకాలు, పథకాల అమలు మంత్రిత్వ శాఖ సోమవారం విడుదల చేసిన డాటా వివరాలు…