Most Expensive Apartment | దేశ ఆర్థిక రాజధాని ముంబై (Mumbai)కి భారతదేశంలోనే (India) అత్యంత ఖరీదైన నగరంగా (Most Expensive City) పేరు ఉంది. ఇక్కడ సలక సౌకర్యాలతో కూడిన ఓ ఇల్లు కొనుగోలు చేయాలంటే కోట్ల రూపాయలు వెచ్చించాల్సి ఉంటుంది. సాధారణ అపార్ట్మెంట్ ధరే రూ.కోటి వరకు ఉంటుందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. అలాంటిది ఇక ఓ లగ్జరీ అపార్ట్మెంట్ (luxury apartment ) గురించి అయితే చెప్పాల్సిన పనేలేదు. అన్ని సౌకర్యాలతో కూడిన ఓ లగ్జరీ అపార్ట్మెంట్ను కొనుగోలు చేయాలంటే రూ.వందల కోట్లు వెచ్చించాల్సిందే. తాజాగా ముంబైలో ఓ మూడంతస్తుల ఫ్లాట్ (triplex apartment ) కళ్లు చెదిరే ధరకు అమ్ముడుపోయింది. ఆ ఫ్లాట్ ధర అక్షరాలా రూ.369 కోట్లు అంట. ఆశ్చర్యంగా ఉంది కదూ..
ప్రముఖ పారిశ్రామికవేత్త (industrialist), హెల్త్కేర్ ఉత్పత్తుల సంస్థ ఫామీ కేర్ (Famy Care) వ్యవస్థాపకుడు జేపీ తపారియా (JP Taparia) కుటుంబసభ్యులు ఈ ఇంటిని కొనుగోలు చేశారు. దక్షిణ ముంబై (South Mumbai) లోని అత్యంత ఖరీదైన మలబార్ హిల్స్ (Malabar Hills) ప్రాంతంలో ఉన్న లగ్జరీ మూడు అంతస్తుల ఫ్లాట్ (luxury triplex apartment )ను రూ.369 కోట్లకు వీరు సొంతం చేసుకున్నారు. బీచ్ వ్యూ ఉన్న ఈ లగ్జరీ ఇంటిని లోధా గ్రూప్ (Lodha group) నకు చెందిన మార్కోటెక్ డెవలపర్స్ (Macrotech Developers) నుంచి వారు కొనుగోలు చేశారు. కాగా, దేశంలో ఇప్పటి వరకు జరిగిన అత్యంత ఖరీదైన అపార్ట్మెంట్ డీల్ (Indias Most Expensive Apartment Deal) ఇదే అని రియల్ఎస్టేట్ (Real estate) వర్గాలు చెప్పుకుంటున్నాయి.
ఇంత విలువైన ఆ అపార్ట్మెంట్ ప్రత్యేకతలేంటో ఒకసారి తెలుసుకుందాం..! ముంబైలో సూపర్ లగ్జరీ రెసిడెన్షియల్ టవర్ (super luxury residential tower)గా పేరొందిన లోధా మలబార్ ప్యాలెస్ (Lodha Malabar Palace)లోని 26,27,28 అంతస్తుల్లో ఈ ట్రిప్లెక్స్ ఉంది. మొత్తం 27,160 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఫ్లాట్ ఉంటుంది. ఫ్లాట్ మొత్తం ధర రూ.369. ఈ లెక్కన ఒక్కో చదరపు అడుగు దాదాపు రూ.1.36లక్షలకు తపారియా కుటుంబం కొనుగోలు చేసింది. చదరపు అడుగుల ప్రాతిపదికన చూసుకుంటే.. దేశంలో ఇదే అత్యంత ఖరీదైన రెసిడెన్షియల్ డీల్. ఈ ఫ్లాట్ను కొనుగోలు చేసేందుకు తపారియా కుటుంబం స్టాంప్ డ్యూటీ కిందనే రూ.19.07 కోట్లు చెల్లించిందట.
కాగా, ఇటీవలే బజాజ్ ఆటో ఛైర్మన్ (Bajaj Auto chairman) నీరజ్ బజాజ్ (Niraj Bajaj) లోధా గ్రూప్ (Lodha Group) నుంచి రూ. 252.5 కోట్లకు సీ ఫేసింగ్ (sea-facing) లగ్జరీ ట్రిప్లెక్స్ పెంట్హౌస్ (luxury triplex penthouse)ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. లోధా మలబార్ ప్యాలెస్ ప్రాజెక్ట్లోని 29, 30, 31వ అంతస్తులలో ఈ అపార్ట్మెంట్ ఉంది. మూడు ఫ్లాట్ల మొత్తం వైశాల్యం 18,008 చదరపు అడుగులు. ఈ అపార్ట్మెంట్కు మొత్తం ఎనిమిది కార్లు పార్క్ చేసుకునే వెసులుబాటు ఉంది. అప్పట్లో ఇదే అతిపెద్ద రియల్ఎస్టేట్ డీల్గా చెప్పుకున్నారు. అయితే, ఆ డీల్ను తపారియా తిరగరాశారు. కాగా, ముంబై మహానగరంలో అత్యంత ఖరీదైన ప్రాంతం, బీచ్ వ్యూ వంటి కారణాలతో ఇక్కడ అపార్ట్మెంట్లు ఇంత ఖరీదు పలుకుతున్నాయని రియల్ఎస్టేట్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Also Read..
Nita Ambani | అట్టహాసంగా ప్రారంభమైన నీతా అంబానీ డ్రీమ్ ప్రాజెక్ట్.. తరలివచ్చిన తారాలోకం
India Corona | 24 గంటల్లో 2,994 కొత్త కేసులు.. ఐదుగురు మృతి
IPL 2023 | ఐపీఎల్ ఆరంభ వేడుకల్లో మార్మోగిన తెలుగు పాటలు.. ‘నాటు నాటు’కు స్టెప్పులేసిన రష్మిక