Trade Agreement : భారత్, బ్రిటన్ మధ్య చరిత్రాత్మక వాణిజ్య ఒప్పందం (Trade Agreement) కుదిరింది. ఇరుదేశాలు పరస్పరం పన్ను మినహాయింపుతో కూడిన అగ్రిమెంట్ చేసుకున్నాయి. రెండు దేశాల ప్రధానులు నరేంద్ర మోడీ (Narendra Modi), కీర్ స్టార్మర్(Keir Starmer)ల సమక్షంలో గురువారం కేంద్ర వాణిజ్య మంత్రి పీయుష్ గోయల్, యూకే మినిస్టర్ జొనాథన్ రెనాల్డ్స్ సంతకాలు చేశారు.
ఈ డీల్తో ఏడాదిలోనే రెండు దేశాల మధ్య రూ.29 లక్షల కోట్ల వ్యాపారం జరగనుంది అంచనా. యూరోపియన్ సభ్య దేశాల నుంచి యూకే బయటికి వచ్చిన పదేళ్లలో ఆ దేశంతో భారత్ చేసుకున్న అతిపెద్ద ఒప్పందం ఇదే. అందుకే భారత్, బ్రిటన్ వ్యాపార సంబంధాల పరంగా ఈ ఒప్పందం ఒక మైలురాయి లాంటిదని ప్రధాని మోడీ అన్నారు.
A new chapter begins today in the India–UK economic partnership! The signing of the Comprehensive Economic and Trade Agreement (CETA) reflects our shared commitment to enhancing trade, driving inclusive growth and creating opportunities for farmers, women, youth, MSMEs, and… pic.twitter.com/FUOo4dkHLU
— Narendra Modi (@narendramodi) July 24, 2025
మనదేశంలోని రైతులు, మత్సకారులు, చిన్న వ్యాపారసంస్థలు.. ఈ అగ్రిమెంట్ లబ్ది చేకూర్చనందని మోడీ పేర్కొన్నారు. ఈ డీల్ కారణంగా యూకేకు మనదేశం ఎగుమతి అయ్యే 99 వస్తువులు, ఇతరాలకు స్టాంపు డ్యూటీ, టారిఫ్లు వర్తించవు. ముఖ్యంగా జౌలీ ఉత్పత్తులు, రత్నాలు, ఆభరణాలు, సీఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, లెదర్ వస్తువులు, ఇంజనీరింగ్ ప్రొడక్ట్స్ వంటి వాటికి ఇకపై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.
ఇక బ్రిటన్ నుంచి దిగుమతి అయ్యే కార్లు, విస్కీ, చాక్లెట్లు, సౌందర్క ఉత్పత్తులుతో పాటు వైద్య పరికరాలు, ఏరోస్పేస్ పార్ట్స్ మీద టారిఫ్స్ విధించరు. వీటిపై గతంలో ఉన్న టారిఫ్ను 15 శాతం నుంచి 3 శాతానికి తగ్గనుంది. అంటే.. ఇవన్నీ ఇకపై భారతీయులకు చౌకగా లభించనున్నాయి.