న్యూఢిల్లీ : అత్యధిక వేతన ఆఫర్తో ఐఐఎం సంబల్పూర్ (IIM Sambalpur ) విద్యార్ధిని మైక్రోసాఫ్ట్లో ఉద్యోగ అవకాశం దక్కించుకుంది. రూ. 67.60 లక్షల వార్షిక వేతనంతో జైపూర్కు చెందిన అవని మల్హోత్రా మైక్రోసాఫ్ట్ జాబ్ ఆఫర్ సొంతం చేసుకున్నారు. ఈ జాబ్ ఆఫర్ కోసం అవనీ మల్హోత్రా ఐదారు రౌండ్ల ఇంటర్వ్యూలను విజయవంతంగా పూర్తిచేశారు.
ఇక గతంలో ఇన్ఫోసిస్లో మూడేండ్ల పాటు పనిచేసిన అనుభవం కూడా ఆమెకు కలిసివచ్చింది. కంప్యూటర్ సైన్స్లో బీటెక్ డిగ్రీ పొందిన అవని తన విజయానికి ప్రొఫెసర్లు, తల్లితండ్రులే కారణమని చెప్పుకొచ్చారు. ఐఐఎం సంబల్పూర్ 2021-23 బ్యాచ్ స్టూడెంట్స్ అందరికీ ప్లేస్మెంట్స్లో ఉద్యోగాలు రాగా, అవనీకి అత్యధిక వేతన ఆఫర్ లభించింది.
ఈ ఏడాది ఎంబీఏ విద్యార్ధులకు సగటు వేతన ఆఫర్ రూ. 16 లక్షలని ఐఐఎం సంబల్పూర్ అధికారులు పేర్కొన్నారు. మహిళా విద్యార్ధినుల సగటు వేతనం రూ. 18.25 లక్షలుగా ఉంది. ఇక మైక్రోసాఫ్ట్ సహా డెలాయిట్, అమెజాన్, ఈవై, యాక్సెంచర్, అమూల్, వేదాంత తదితర కంపెనీలు ఐఐఎం విద్యార్ధులకు మెరుగైన జాబ్ ఆఫర్లు అందించాయి.
Read More
IIT Mandi Recruitment | ఐఐటీ మండీలో నాన్-టీచింగ్ ఉద్యోగాలు
C-DOT Recruitment | సీడాట్లో 156 ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు