నిజాంసాగర్, జూలై 5: ఆపత్కాలంలోనూ సీఎం కేసీఆర్ రైతులకు అండగా ఉండి పెట్టుబడి సాయాన్ని అందించారని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కొనియాడారు. రైతాంగం రెండు పంటలు పండించాలన్నదే సీఎం కేసీఆర్ ఆశయమని ఆయన పేర్కొన్నారు. సోమవారం రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డితో కలిసి నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి ఆయకట్టుకు స్పీకర్ నీటిని విడుదల చేశారు. ముందుగా హసన్పల్లి శివారులోని ప్రధాన కాలువ గేట్లకు, గంగమ్మ తల్లికి పూజలు చేశారు. కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా ప్రాజెక్టుకు నీటిని మళ్లించడంతో నిజాంసాగర్ ఆయకట్టు రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.
సీఎం కేసీఆర్కే సాధ్యం: వేముల
నిజాంసాగర్ ఆయకట్టుకు జూలై మొదటి వారంలోనే సాగు నీటిని అందించడం గొప్ప విషయమని, అది కేవలం సీఎం కేసీఆర్కే సాధ్యమైందని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. స్పీకర్ పోచారం, మంత్రి వేముల, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే హన్మంత్షిండే, జడ్పీ చైర్పర్సన్ దఫేదార్ శోభారాజు, కలెక్టర్ శరత్తో కలిసి హసన్పల్లిలో పల్లె ప్రగతిలో భాగంగా మొక్కలు నాటారు.