హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ):తెలంగాణ రాష్ట్రం దేశంలో సరికొత్త చరిత్రను లిఖిస్తున్నది. కొత్త, చిన్న రాష్ట్రంగా ఉన్న తెలంగాణ దశాబ్దాల క్రితం ఏర్పాటైన రాష్ర్టాలతో పోటీ పడటమే కాకుండా.. ప్రతిష్ఠాత్మక కంపెనీలు ఆకట్టుకోవడంలోనూ దూసుకుపోతున్నది. ఆయా రాష్ర్టాల్లో వెళ్లానుకున్న కంపెనీలు సైతం తెలంగాణ పెట్టుబడులు పెట్టడానికి క్యూ కడుతున్నాయి. మూడు నాలుగు దశాబ్దాల చరిత్ర ఉన్న కంపెనీలు సైతం సొంత రాష్ర్టాన్ని వదిలి తమ వ్యాపార విస్తరణలో భాగంగా తెలంగాణలో యూనిట్లను నెలకొల్పడానికి ఉత్సాహంగా ముందుకొస్తున్నాయి. ఇందులో భాగంగా తాజాగా అమరరాజా బ్యాటరీ కంపెనీ భారీ పెట్టుబడికి తెలంగాణను గమ్యస్థానంగా ఎంచుకొంది.
ఈ సంస్థతో పాటుగా అనేక సంస్థలు వందల కోట్లతో పెట్టుబడులు పెడుతూ ఇక్కడున్న పారిశ్రామిక అనుకూల విధానాన్ని ప్రపంచానికి చాటుతున్నాయి. ఇతర దేశాలు, రాష్ర్టాల్లో ఏర్పాటయ్యే కంపెనీలు సహాజంగా అక్కడే విస్తరించడానికి ప్రయత్నాలు చేస్తాయి. అక్కడ వాటికి అవసరమైన భూములు ఉండటం, ఆ ప్రాంతంపై పట్టు ఉండటం, ముడి సరుకు రవాణాకు అవసరమైన వ్యవస్థ ఉండటం, ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వంతో మంచి సంబంధాలు, కంపెనీకి అవసరమైన ముడి సరుకు లభ్యం కావడం లాంటి కారణాలతో కంపెనీని స్థాపించిన చోటనే వాటిని విస్తరించడానికే మొగ్గు చూపుతాయి. వేరే చోటుకి వెళ్లడానికి ఆసక్తి చూపించవు. స్థాపించిన ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాయి కంపెనీలు అంటే అక్కడి కంటే ఎక్కువగా సౌకర్యాలు, ఆదరణ, ఇంత కంటే ఎక్కువగా ప్రభుత్వ సహకారం, నిర్ణీత కాలంలో కంపెనీ స్థాపనకు అనుమతులు రావడం, అక్కడి ప్రభుత్వ విధానాలు ఆకర్షితులై నూతన యూనిట్ను నెలకొల్పడానికి ముందుకొస్తాయి.
తెలంగాణలో పరిశ్రమల పెట్టుబడుల ఆకర్షణకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు రూపొందించిన పాలసీ, అనుసరిస్తున్న విధానాలు.. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు ప్రో యాక్టివ్ విధానాల వల్ల తెలంగాణకు అంతర్జాతీయంగా, జాతీయంగా అప్పటికే ఆయా ప్రాంతాల్లో వెళ్లాలనుకున్న కంపెనీలు కూడా తెలంగాణ ఆకర్షించగలుగుతుంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రఖ్యాతిగాంచిన కంపెనీలు కూడా వారి సొంత రాష్ర్టాలు, దేశాలను కాదని హైదరాబాద్ను తమ గమ్యస్థానంగా ఎంచుకుంటున్నారు. ఇలాంటి వాటిల్లో ప్రముఖ కంపెనీలైన అమరరాజా బ్యాటరీ, కైటెక్స్, వెల్స్పన్, కుందన టెక్నోటెక్స్, గణేశ ఎకో స్పియర్, టెక్స్పోర్ట్ ఇండస్ట్రీస్, ప్లాంట్ లిపిడ్స్, గ్లోస్టర్ లిమిటెడ్, హాట్సన్ ఆగ్రో ప్రైవేటు లిమిటెడ్తో సహా అనేక కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టబోతున్నాయి.
ఏపీ నుంచి తెలంగాణకు జాకీ
అమెరికాకు చెందిన లోదుస్తుల తయారీ సంస్థ జాకీ కూడా తన ప్లాంట్ను తెలంగాణకు తరలిస్తున్నట్లు ప్రకటించింది. గతంలో తమ యూనిట్ను ఏపీలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అక్కడ నిర్మాణాలు కూడా ప్రారంభించింది. అయితే అక్కడ స్థానికంగా రాజకీయ కారణాలతో రెండు సంవత్సరాల తర్వాత తన గమ్యస్థానాన్ని హైదరాబాద్కు మార్చుకుంది. తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్నట్లుగా ప్రకటించింది.
బ్యాటరీ రారాజు అమర రాజా..
బ్యాటరీ రారాజుగా వెలుగొందుతున్న అమర రాజా బ్యాటరీస్…1985లో ప్రారంభమైంది. ఆంధ్ర ప్రదేశ్కు చెందిన ఈ కంపెనీ తిరుపతికి 12కిలోమీటర్ల దూరంలోని మారుమూల గ్రామమైన కరకంబాడిలో వ్యవస్థాపకులు గల్లా రామచంద్ర నాయుడు ఏర్పాటు చేశారు. దాదాపుగా 37 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ కంపెనీ ఇప్పటి వరకు ఇతర రాష్ర్టాల్లో పెద్దగా పెట్టుబడులు పెట్టలేదు. అక్కడే తన కంపెనీని విస్తరిస్తూ వచ్చింది. 37 సంవత్సరాల చరిత్రలో తొలిసారిగా ఇతర ప్రాంతాల్లో అదీ తెలంగాణలో భారీగా పెట్టుబడి పెట్టడానికి ముందకొచ్చింది. ఇందుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. ఈ యూనిట్ ఏర్పాటునకు సంబంధించి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు దావోస్లో గల్లా జయదేవ్తో దాదాపుగా గంటపాటు చర్చలు జరిపారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఈ సందర్భంగా ఆయనను ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాకాలు, అనుకూలతలు ఆయనకు వివరించారు.
కిటెక్స్
సొంత రాష్ట్రం: కేరళ
రాష్ట్రంలో పెట్టుబడి: రూ.3,200 కోట్లు
రంగం: టెక్స్టైల్
హాట్సన్ అగ్రో ప్రైవేట్ లిమిటెడ్
సొంత రాష్ట్రం: తమిళనాడు
తెలంగాణలో పెట్టుబడి:
రూ. 400 కోట్లు
రంగం: ఐస్క్రీం
లిపిడ్ ప్రైవేట్ లిమిటెడ్
సొంత రాష్ట్రం: కేరళ
తెలంగాణలో పెట్టుబడి:
రూ. 80 కోట్లు
రంగం: మిర్చి, ఇతర సుగంధ ద్రవ్యాల నుంచి నూనె తయారు చేస్తున్నది.
వెల్స్పన్ ఇండియాలిమిటెడ్
సొంత రాష్ట్రం: గుజరాత్
రాష్ట్రంలో పెట్టుబడి:రూ.1677 కోట్లు
రంగం: టెక్నికల్ టెక్స్టైల్స్,
ఫ్లోరింగ్ సొల్యూషన్స్
కుందన టెక్నోటెక్స్ (పశుపతి గ్రూపు)
సొంత రాష్ట్రం: ఉత్తర ప్రదేశ్
రాష్ట్రంలో పెట్టుబడి : రూ.220 కోట్లు
రంగం: రిసైక్లింగ్ పీఐటీ ఉత్పత్తులు
గణేశ ఎకోస్పియర్
సొంత రాష్ట్రం: ఉత్తర ప్రదేశ్
రాష్ట్రంలో పెట్టుబడి :
రూ.550 కోట్లు
రంగం: రిైస్లెంకింగ్ పీఐటీ ఉత్పత్తులు
గ్లోస్టర్ లిమిటెడ్
సొంత రాష్ట్రం : పశ్చిమ బెంగాల్
రాష్ట్రంలో పెట్టుబడులు :
రూ.330 కోట్లు
రంగం: జ్యూట్, గోనె సంచుల తయారీ
సొంత రాష్ట్రం: గుజరాత్
రాష్ట్రంలో పెట్టుబడులు : రూ.1650 కోట్లు
రంగం: బీవోపీపీ , బీవోపీఈటీ ఫిల్మ్ల తయారీ
సొంత రాష్ట్రం : కేరళ
రాష్ట్రంలో పెట్టుబడి :
రూ.700 కోట్లు
తయారీ: గోల్డ్ రిఫైనరీ, ప్రాసెసింగ్
తెలంగాణ.. ఇండస్ట్రీ ఫ్రెండ్లీ
తెలంగాణ ప్రభుత్వం.. పారిశ్రామిక రంగాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నది. కేరళలో ఈ పరిస్థితులు లేవు. అక్కడ 53 ఏండ్లుగా వ్యాపారం చేస్తున్నాను. ప్రపంచం ఎంతో మారింది. అయినా కేరళ మాత్రం 50 ఏండ్లు వెనుకబడే ఉన్నది. తెలంగాణ తరహాలో పెట్టుబడులను ఆకట్టుకోవాలి. రాష్ట్రంలో గార్మెంట్ పరిశ్రమ పెట్టడానికి ఇక్కడి ప్రభుత్వం నాకు అనేక ప్రోత్సాహకాలను ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. నా కోసం ప్రత్యేకంగా ఓ చార్టెడ్ జెట్నే పంపింది.’
-సాబు ఎం జాకబ్, కిటెక్స్ గ్రూప్ ఎండీ