Shock for Crypto’s | హ్యాకర్లు అంటే కంప్యూటర్ నెట్వర్క్పై దాడి చేసేవారు.. కానీ తాజాగా అత్యంత సంక్లిష్టమైన క్రిప్టో కరెన్సీ లావాదేవీలను హ్యాక్ చేసి 613 మిలియన్ల డాలర్లను దోచుకున్న ఘటన మంగళవారం జరిగింది. అయితే, వాటిలో 260 మిలియన్ల డాలర్లు మాత్రం తిరిగి వచ్చాయి. పాలి నెట్వర్క్ అనే డీ సెంట్రలైజ్డ్ ఫైనాన్స్ (డీఈఎఫ్ఐ) అనే ప్లాట్ఫామ్ను ఇందుకు వాడుకున్నారు.ఇంకా 353 మిలియన్ల డాలర్లు తిరిగి రాలేదని పాలీ నెట్వర్క్ పేర్కొంది.
పీర్ టూ పీర్ లావాదేవీల కోసం వినియోగిస్తున్న ఫ్లాట్ఫామ్ డీఈఎఫ్ఐ.. దీని ద్వారా ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తి లేదా సంస్థ మధ్య లావాదేవీల్లో భాగంగా వివిధ క్రిప్టో కరెన్సీ టోకెన్లను బదిలీ చేస్తారు. ఎథిరియం బ్లాక్ చైన్ నుంచి బినాన్స్ స్మార్ట్ చైన్కు బిట్ కాయిన్ను యూజర్లు బదిలీ చేస్తారు. బినాన్స్ స్మార్ట్ చైన్, ఎథిరియం అండ్ పాలిగాన్ బ్లాక్ చైన్స్తో పాలీ నెట్ వర్క్ కార్యకలాపాలు నిర్వహిస్తుంది.
ఇదిలా ఉంటే క్రిప్టో కరెన్సీలను హ్యాకర్ల దోపిడీపై ప్రాథమిక దర్యాప్తు చేపట్టినట్లు పాలీ నెట్వర్క్ పేర్కొంది. హ్యాకర్లు 12కి పైగా క్రిప్టో కరెన్సీల నుంచి నిధులను దొంగిలించారు. వాటిల్లో ఏథెర్.. బిట్ కాయిన్ వంటి టోకెన్లు ఉన్నాయి.