HDFC Bank ties up with Paytm | దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ.. ఆన్లైన్ పేమెంట్స్ సంస్థ పేటీఎంతో జత కట్టనున్నది. యువకులు, వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని వీసా ప్లాట్ఫామ్ వేదికగా పేటీఎంతో కలిసి కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులను జారీ చేయనున్నది. క్రెడిట్ కార్డుల జారీలో అగ్రస్థానానికి దూసుకెళ్లాలన్న లక్ష్యంతో హెచ్డీఎఫ్సీ బ్యాంకు ముందుకు సాగుతున్నది. ఇందుకోసం పేటీఎంకు గల 33 కోట్ల మంది కస్టమర్ బేస్కు ఈ క్రెడిట్ కార్డులను అందుబాటులోకి తేనున్నది.
పేటీఎంకు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు, పట్టణాల్లోనూ కస్టమర్లు ఉన్నారు. డిజిటల్ పేమెంట్స్ను మరింత ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో పేటీఎంతో హెచ్డీఎఫ్సీ జట్టు కట్టనున్నది. పండుగల సీజన్ సందర్భంగా వచ్చేనెలలో క్రెడిట్ కార్డులను జారీ చేయనున్నాయి హెచ్డీఎఫ్సీ.. పేటీఎం. ప్రస్తుతం క్రెడిట్ కార్డులకు ఉన్న అధిక డిమాండ్ను సొమ్ము చేసుకోవాలని రెండు సంస్థలు భావిస్తున్నాయి.
ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరు వరకు నెలవారీ వాయిదా (ఈఎంఐ), బై నౌ పే లేటర్ (బీఎన్పీఎల్) ఆప్షన్లను హెచ్డీఎఫ్సీ బ్యాంక్, పేటీఎం కస్టమర్లకు ఆఫర్ చేయనున్నాయి. రిటైల్ కస్టమర్ల అవసరాలకు తీర్చేందుకు క్రెడిట్ కార్డులు ఉపకరిస్తాయన్నారు. క్రెడిట్ కార్డులు తీసుకున్న కస్టమర్లకు బెస్ట్ ఇన్ క్లాస్ రివార్డ్స్, క్యాష్ బ్యాక్ ఆఫర్లను ప్రవేశపెట్టనున్నాయి. అంతే కాదు బిజినెస్ క్రెడిట్ కార్డులను అందుబాటులోకి తేనున్నాయి. దీనివల్ల పేటీఎంకు పునాదిగా ఉన్న 2.1 కోట్ల మందికి పైగా వ్యాపారులకు లబ్ధి చేకూరనున్నది.
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
ఉద్దేశపూర్వకంగా నాపై దుష్ప్రచారం.. రేవంత్పై కోర్టులో కేటీఆర్ పిటిషన్
#RahulDrugTest: రాహుల్ డ్రగ్టెస్ట్.. ట్విట్టర్లో ట్రెండింగ్
Stock markets: భారీగా నష్టపోయిన దేశీయ స్టాక్ మార్కెట్లు
న్యూ డుకాటి మాన్స్టర్ బుకింగ్స్ షురూ : ధర ఎంతంటే..!