న్యూఢిల్లీ, ఆగస్టు 8:దేశంలో అతిపెద్ద ప్రైవేట్ రంగ ఆర్థిక సేవల సంస్థ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కూడా వడ్డీరేట్లను పెంచేసింది. అన్ని రకాల రుణాలపై వడ్డీరేట్లను 5 బేసిస్ పాయింట్ల నుంచి 10 బేసిస్ పాయింట్ల వరకు పెంచినట్లు తెలిపింది.
రిజర్వు బ్యాంక్ రెపోరేటును అర శాతం పెంచడంతో బ్యాంకులు తమ వడ్డీరేట్లను సవరిస్తున్నాయి. దీంట్లోభాగంగా సోమవారం నుంచి అమలులోకి వచ్చేలా మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)ని 5-10 బేసిస్ పాయింట్ల లోపు పెంచినట్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వెల్లడించింది.