‘ఎన్నో ఉద్యమాల తర్వాత 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. నాడు రాష్ట్ర భవిష్యత్తుపై అనేక అనుమానాలుండేవి. ముఖ్యంగా పెట్టుబడులు వస్తాయా?.. అని చాలామంది అనేవారు. వీటన్నింటిని పటాపంచెలు చేస్తూ నేడు అనేక రంగాల్లో తెలంగాణ దేశానికే ఆదర్శంగా ఎదిగింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈవోడీబీ)లో రాష్ట్రం లీడర్గా అవతరించింది. పారిశ్రామిక రంగంలో రాష్ర్టాన్ని టాప్లో నిలిపేందుకు సింగపూర్ వంటి అభివృద్ధి చెందిన దేశాల మోడల్ను అధ్యయనం చేశాం. టీఎస్ ఐపాస్ పేరుతో 2014 నవంబర్లో ప్రగతిదాయక పారిశ్రామిక పాలసీని తెచ్చాం. అమెరికాలో ముఖ్యమైన ప్రాంతాల్లో ‘ఈజీ పాస్’ అనే విధానం ఉంటుంది. ఇదే తరహాలో ఇక్కడ టీఎస్ ఐపాస్ చట్టాన్ని తీసుకొచ్చాం’
-కేటీఆర్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి
హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): ప్రగతిశీల విధానాల ద్వారా అతికొద్ది కాలంలోనే తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఎదిగిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు అన్నారు. పరిశ్రమలకు వేగంగా అనుమతులు ఇచ్చేందుకు ఉద్దేశించిన టీఎస్ ఐపాస్ వంటి చట్టం అమెరికాలో కూడా లేదని స్వయంగా అక్కడివారే ఒప్పుకున్నారంటూ చెప్పారు. శనివారం హైదరాబాద్లోని హోటల్ వెస్టిన్లో జరిగిన సీఐఐ సదరన్ రీజినల్ కౌన్సిల్ సమావేశానికి మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో పెట్టుబడులకున్న అనుకూలతలు, సాధించిన విజయాలను వివరించారు.
చైనాతో భారత్ పోటీ
భారత్ నేడు చైనాతో పోటీపడుతున్నదని, గ్లౌజులు-మాస్క్లను చైనాకన్నా తక్కువ ధరకే ఇక్కడి నుంచి ఎగుమతి చేస్తున్నామని కేటీఆర్ గుర్తుచేశారు. కరోనా తరువాత చైనాకు ప్రత్యామ్నాయంగా పెట్టుబడిదారులు భారత్ వైపు చూస్తున్నారని తెలిపారు. సరైన నిర్ణయాలు తీసుకునేందుకు ఇదే మంచి సమయమని పారిశ్రామిక వేత్తలకు సూచించారు. ప్రతిభ, నైపుణ్యం కలిగిన యువత, శ్రామిక శక్తికి తెలంగాణలో కొదవే లేదని, స్కిల్స్ బిల్డింగ్పైనా దృష్టి సారించినట్టు తెలిపారు.
జిల్లాల అభివృద్ధి
సమ్మిళిత అభివృద్ధిలో పెట్టుబడులను ద్వితీయ శ్రేణి నగరాలకు మళ్లించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు. పరిశ్రమలన్నీ హైదరాబాద్కు పరిమితం కాకుండా రాష్ట్రంలోని ఇతర నగరాలపైనా దృష్టి పెడుతున్నట్టు వివరించారు. వరంగల్లో అతిపెద్ద టెక్స్టైల్ పార్క్ను ఉదహరించారు. చెన్నైలో ఉక్కపోత, ఢిల్లీలో కాలుష్యం, బెంగళూరులో ట్రాఫిక్ సమస్య, ముంబైలో ఖర్చుల భారం, ఇక అహ్మదాబాద్ సొంత సమస్యలతో సతమతమవుతున్నదన్న మం త్రి.. ఈ క్రమంలో అత్యుత్తమమైన నగరం హైదరాబాదేనన్నారు. పచ్చదనంలోనూ ఇటీవలే గ్రీన్సిటీ అవార్డు వచ్చిందని గుర్తుచేశారు.
వ్యాక్సిన్ ఉత్పత్తిలో దూకుడు
ప్రపంచ వ్యాక్సిన్ ఉత్పత్తిలో మూడోవంతు తెలంగాణలోనే ఉత్పత్తి అవుతున్నదని, తొమ్మిది బిలియన్ డోసులు ఇక్కడి నుంచి ఎగుమతి చేసినట్టు మంత్రి చెప్పారు. వ్యాక్సిన్ కంపెనీలు భారీగా విస్తరిస్తున్నాయని, దీంతో వచ్చే ఏడాది వ్యాక్సిన్ ఉత్పత్తి 14 బిలియన్ డోసులకు పెరుగుతుందన్నారు. ఇక జీనోమ్ వ్యాలీ ప్రపంచంలోనే అత్యాధునిక జీవశాస్ర్తాల క్లస్టర్ అని, ఇది తెలంగాణకే గర్వకారణమన్నారు. సుల్తాన్పూర్లో మెడ్టెక్ పార్క్ను ఏర్పాటు చేశామని, అక్కడ 50 కంపెనీలకన్నా ఎక్కువ వచ్చాయన్నారు. ఆసియాలోనే అతిపెద్ద స్టెంట్ల తయారీ కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారని తెలిపారు.
ఇతర రంగాల్లోనూ..
ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లోనూ హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందుతున్నదని, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెలీకాప్టర్ క్యాబిన్ హైదరాబాద్లో తయారైందేనని మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. లాక్హీడ్, బోయింగ్, శాఫ్రాన్ వంటి ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు ఇక్కడ కార్యకలాపాలు సాగిస్తున్నాయన్నారు. హైదరాబాద్.. నార్త్, సౌత్ కాదని, ఎక్కడివారైనా ప్రజలంతా ఇక్కడ సంతోషంగా ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలో 2014లో 68 లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి అవగా, నేడు 3.5 కోట్ల మెట్రిక్ టన్నులకు చేరిందని స్పష్టం చేశారు.
సాగు, పాడి పరిశ్రమల్లో..
సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా రాష్ట్రంలో హరిత విప్లవం సాకారమైందని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరంను నిర్మించామన్నారు. దీనిద్వారా సముద్రమట్టం నుంచి 618 మీటర్ల ఎత్తుకు నీటిని తరలిస్తున్నట్టు వివరించారు. నీలి విప్లవంలోనూ ఎంతో శరవేగంగా అభివృద్ధి చెందుతున్నట్టు, ఇన్లాండ్ ఫిషరీస్లో రాష్ట్రం నెంబర్ 1గా ఎదిగిందని చెప్పారు. రాష్ట్రంలో కుంటలు, చెరువులు, జలాశయాలు 48 వేల వరకున్నాయని, మిషన్ కాకతీయ ద్వారా వీటిని సమగ్ర రీతిలో అభివృద్ధి చేయడంతో చేపల పెంపకం పరుగులు పెడుతున్నదన్నారు. సిరిసిల్లలో అమెరికాకు చెందిన కంపెనీ.. మిడ్ మానేర్ రిజర్వాయర్లో అతిపెద్ద ఆక్వా హబ్ను ఏర్పాటు చేస్తున్నదన్నారు. అలాగే డెయిరీ రంగం కూడా అభివృద్ధి చెందినట్టు, కోళ్ల పరిశ్రమ కూడా ఐదేండ్లలో రెట్టింపైందన్నారు.
త్రీ ఐ మంత్రా
25 ఏండ్లలో దేశాన్ని అగ్రభాగాన నిలిపేందుకు సూచనలివ్వాలని కొన్నేండ్ల క్రితం ప్రధాని మోదీ సమావేశాన్ని ఏర్పాటు చేయగా, టీఆర్ఎస్ తరపున తాను పాల్గొని త్రీ ‘ఐ’ మంత్రాను వివరించినట్టు ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తుచేశారు. ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్క్లూసివ్ గ్రోత్ ద్వారా దేశాన్ని ప్రగతిపథాన నడిపించవచ్చని చెప్పానన్నారు. అయితే ఇన్నోవేషన్ అంటే కేవలం స్టార్టప్స్కు పరిమితం కాదని, ఇది శాసన, కార్వనిర్వాహక, న్యాయ, మీడియా తదితర నాలుగు ప్రధాన రంగాల్లో జరగాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.
ఈడీ, సీబీఐలతో బెంబేలు: మాజీ సీజేఐ ఎన్వీ రమణ
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ), సీరియస్ ఫ్రాడ్స్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐవో) వంటి అనేక దర్యాప్తు సంస్థలతో భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితులు దేశంలో ఏర్పడ్డాయని సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) ఎన్వీ రమణ ఒకింత ఆందోళన వ్యక్తం చేశారు.
సివిల్ వివాదాలను నేరంగా పరిగణించడంపట్ల వ్యాపార వర్గాలు భయానికి లోనవుతున్నాయని, క్రిమినల్ చట్టాన్ని కొన్నిసార్లు బెదిరించడానికి, వేధించడానికి వాడుతున్నట్టు చెప్తున్నారన్నారు. సీఐఐ సమావేశంలో ‘భారత ఆర్థిక వ్యవస్థలో న్యాయ వ్యవస్థ యెక్క పాత్ర, బాధ్యతలు’ అనే అంశంపై రమణ మాట్లాడారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం బినామీ నిషేధ చట్టం, మనీ లాండరింగ్ నిరోధక చట్టం, కంపెనీల చట్టం, పన్ను చట్టాలు తదితరవాటికి భయపడుతున్నారని తెలిపారు. చట్టబద్ధమైన పాలన ఎంతో అవసరమని, చట్టానికి ఎవరూ అతీతులు కారన్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్
ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్ను ఏర్పాటు చేస్తున్నట్టు కేటీఆర్ వెల్లడించారు. అయితే కోర్టు కేసుల వల్ల కొంత జాప్యం జరిగినప్పటికీ త్వరలోనే శంకుస్థాపన చేయనున్నట్టు తెలిపారు. లైఫ్ సైన్సెస్ రంగం కోవిడ్ తర్వాత ఎంతో ప్రాధాన్యత సంతరించుకుందన్నారు. అమెజాన్ తమ అతిపెద్ద క్యాంపస్ బిల్డింగ్ను హైదరాబాద్లోనే పెట్టిందని, 3.1 మిలియన్ చదరపు అడుగుల కార్యాలయాన్ని ఇక్కడ ప్రారంభించిందన్నారు. ఈ కంపెనీకి కేవలం 11 రోజుల్లో అన్ని అనుమతులూ ఇచ్చామన్నారు. గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, ఆపిల్, మైక్రాన్, క్వాల్కామ్, మెట్రానిక్ తదితర కంపెనీలున్నాయన్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్
ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్ను ఏర్పాటు చేస్తున్నట్టు కేటీఆర్ వెల్లడించారు. అయితే కోర్టు కేసుల వల్ల కొంత జాప్యం జరిగినప్పటికీ త్వరలోనే శంకుస్థాపన చేయనున్నట్టు తెలిపారు. లైఫ్ సైన్సెస్ రంగం కోవిడ్ తర్వాత ఎంతో ప్రాధాన్యత సంతరించుకుందన్నారు. అమెజాన్ తమ అతిపెద్ద క్యాంపస్ బిల్డింగ్ను హైదరాబాద్లోనే పెట్టిందని, 3.1 మిలియన్ చదరపు అడుగుల కార్యాలయాన్ని ఇక్కడ ప్రారంభించిందన్నారు. ఈ కంపెనీకి కేవలం 11 రోజుల్లో అన్ని అనుమతులూ ఇచ్చామన్నారు. గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, ఆపిల్, మైక్రాన్, క్వాల్కామ్, మెట్రానిక్ తదితర కంపెనీలున్నాయన్నారు.
ప్రగతిపథాన తెలంగాణ