మేడ్చల్, జూలై 9: పట్టణ ప్రగతిలో చేపడుతున్న పారిశుధ్యం పనులతో పట్టణాలు సుందరంగా మారుతున్నాయి. మేడ్చల్ నియోజకవర్గంలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో తొమ్మిదో రోజు చేపట్టిన పట్టణ ప్రగతి, హరితహారంలో మేయర్లు, చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.
పట్టణ ప్రగతితో కాలనీలు పరిశుభ్రంగా మారుతున్నాయని మేడ్చల్ మున్సిపల్ చైర్మన్ దీపికా నర్సింహా రెడ్డి అన్నారు.మున్సిపాలిటీలోని 3వ, 23వ వార్డుల్లో నిర్వహించిన పట్టణ ప్రగతిలో కౌన్సిలర్లు దేవరాజ్, మహేశ్లతో కలిసి చైర్మన్ వార్డు ప్రజలతో సమావేశాలు నిర్వహించి సమస్యలు తెలుసుకున్నారు. కమిషనర్ సత్యనారాయణరెడ్డి,నర్సింహా రెడ్డి పాల్గొన్నారు.
మేడ్చల్ కలెక్టరేట్ : పట్టణ ప్రగతితో సమస్యలు పరిష్కారానికి నోచుకుంటున్నాయని మున్సిపల్ చైర్మన్లు కౌకుట్ల చంద్రారెడ్డి, వసుపతి ప్రణీత శ్రీకాంత్ గౌడ్ అన్నారు. రెండు మున్సిపాలిటీల్లో నిర్వహించిన హరితహారం, పట్టణ ప్రగతిలో మున్సిపల్ చైర్మన్లు పాల్గొని మొక్కలు నాటి ఇంటింటికి పంపిణీ చేశారు. కమిషనర్లు ఎ.వాణి రెడ్డి, స్వామి, ప్రత్యేక అధికారులు , వైస్ చైర్మన్లు నరేందర్, మల్లేష్, కౌన్సిలర్లుమమత కృష్ణారెడ్డి, పంగ హరిబాబు,సురేఖ భాస్కర్ గౌడ్, వెంకటేష్ పాల్గొన్నారు.
ఘట్కేసర్ : ఘట్కేసర్లో 16వ వార్డులో చైర్పర్సన్ పావనీ జంగయ్య యాదవ్, పోచారం 12వ వార్డులో చైర్మన్ బి.కొండల్రెడ్డి ఆధ్వర్యంలో సమావేశాలు, మొక్కల పంపిణీ, పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించారు.ఇంటింటికీ 6 మొక్కలను పంపిణీ చేశారు. వైస్ చైర్మన్ మాధవ రెడ్డి, రెడ్యానాయక్, కౌన్సిలర్లు బి.హరిప్రసాద్రావు,కె.మల్లేశ్, కమిషనర్లు పాల్గొన్నారు.
పీర్జాదిగూడ : చెట్లతోనే మానవ మనుగడ ముడిపడి ఉందని , ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్రెడ్డి అన్నారు. నగరపాలక పరిధిలోని 1వ డివిజన్లో నిర్వహించిన హరితహారంలో మేయర్ పాల్గొని మొక్కలు నాటారు. కమిషనర్ శ్రీనివాస్, డీఈ శ్రీనివాస్ పాల్గొన్నారు. 11వ డివిజన్లో కార్పొరేటర్ యుగేందర్రెడ్డి ఇంటింటికీ మొక్కలు అందజేసి చెత్త బుట్టలు పంపిణీ చేశారు.
శామీర్పేట : జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 16వ డివిజన్.. అరుంధతీనగర్లో కార్పొరేటర్ విశ్రాంతమ్మ రోడ్లకు మరమ్మతులు చేయించారు. 13వ వార్డులో టీఆర్ఎస్ ఎస్సీ సెల్ కార్యదర్శి రాజు మొక్కలు పంపిణీ చేశారు. కార్పొరేటర్లు మురుగేష్, సంగీతరాజశేఖర్, ఆశాకుమారి,సాయిలు డివిజన్లలో పిచ్చిమొక్కల తొలగింపు, రోడ్లకు మరమ్మతులు చేపట్టారు.
తూంకుంట మున్సిపాలిటీ అంతాయిపల్లిలో నిర్వహిం చిన హరితహారంలో కమిషనర్ గంగాధర్, మేనేజర్ శ్రవణ్కుమార్, బిల్ కలెక్టర్లు పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం ప్రతి ఇంటికి 6 మొక్కలు పంపిణీ చేశారు.
మేడ్చల్ రూరల్ : గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని మూడో వార్డులో చైర్పర్సన్ మద్దుల లక్ష్మీశ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ ప్రభాకర్, కమిషనర్ అమరేందర్ రెడ్డి, ప్రత్యేక అధికారి రాంచందర్, మాజీ సర్పంచ్ మద్దుల శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.
బోడుప్పల్, జూలై 9 : సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ తలపెట్టిన పల్లె, పట్టణ ప్రగతితో పల్లెలు, పట్టణాల రూపురేఖలు మారుతున్నాయని తెలిపారు. శుక్రవారం మేయర్ సామల బుచ్చిరెడ్డి, అదనపు కలెక్టర్ శ్యాంసన్, ఎమ్మెల్సీ వాణీదేవితో కలిసి మంత్రి రూ.4కోట్లతో రా చెరువు-సుద్దకుంట చెరువు నాలా నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం పారిశుధ్య పనులకోసం మున్సిపల్ సాధారణ నిధుల నుంచి కొనుగోలు చేసిన ట్రాక్టర్ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మేయర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు.ప్రభుత్వం పేద, బడుగు, బలహీనవర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నదని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం ప్రభుత్వానికి రెండు కళ్లు అని ఎమ్మెల్సీ వాణీదేవి అన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీరవిగౌడ్, పార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, నాయకులు, కాలనీవాసలు పాల్గొన్నారు.