న్యూఢిల్లీ, జూన్ 29: దేశంలో అత్యంత ‘ఆకర్షణీయ ఉద్యోగ సంస్థ బ్రాండ్’గా టెక్నాలజీ దిగ్గజం గూగుల్ ఇండియా నిలిచింది. ఆ తర్వాత అమెజాన్ ఇండియా, మైక్రోసాఫ్ట్ ఇండియాలున్నాయి. రాండ్స్టడ్ ఎంప్లాయర్ బ్రాండ్ రిసెర్చ్ 2021 ప్రకారం ఆర్థిక పరిపుష్ఠి, బలమైన కీర్తి-ప్రతిష్ఠలు, ఆకర్షణీయమైన జీతం, ఇతరత్రా ప్రయోజనాల ఆధారంగా టాప్-3లో ఈ మూడు సంస్థలు నిలబడ్డాయి. 34 దేశాల్లోని 6,493 సంస్థలపై 18-65 ఏండ్ల వయసున్న 1.9 లక్షల మంది అభిప్రాయాలతో ఈ సర్వే జరిగింది. ఈ క్రమంలోనే భారత్లో ఎక్కువమంది గూగుల్లో పనిచేసేందుకు ఆసక్తి కనబర్చినట్లు తేలింది.
టాప్-10లో నాల్గు, ఐదు స్థానాల్లో ఇన్ఫోసిస్, టాటా స్టీల్ ఉన్నాయి. అలాగే 8, 9 స్థానాల్లో టీసీఎస్, విప్రో నిలిచాయి. ఇవిగాకుండా డెల్ టెక్నాలజీస్ (6), ఐబీఎం (7), సోనీ (10) ఉన్నాయి.