న్యూఢిల్లీ: కరోనా రెండో వేవ్ ఉధ్రుతంగా సాగుతున్న వేళ మరోమారు బంగారం బుల్ రన్ దిశగా వడివడిగా పరుగులు తీస్తున్నది. కేవలం గత నెల రోజుల్లోనే శరవేగంగా పెరిగింది బంగారం ధర. అంతర్జాతీయ మార్కెట్లో నాలుగు నెలల గరిష్ఠానికి చేరుకున్న బంగారం.. దేశీయంగా ఒక్క నెలలోనే పెరిగిపోవడం ఆసక్తి కర పరిణామం.
దేశీయ మార్కెట్లోనూ బంగారం, వెండి ధరలు ఒకేస్థాయిలో పెరుగుతున్నాయి. మల్టీ కమొడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో జూన్ ఫ్యూచర్స్ బంగారం తులం ధర రూ.48 వేలపై చిలుకు పలుకుతున్నది. కిలో వెండి ధర రూ.71 వేలు దాటింది.
ద్రవ్యోల్బణం పెరుగుతున్నదన్న ఆందోళనల మధ్య ప్రపంచంలోకెల్లా అతిపెద్ద అమెరికా కరెన్సీ డాలర్ బలహీన పడింది. దీంతో బంగారం, వెండి ధరలు ఎక్స్ప్రెస్ వేగంతో పెరుగుతున్నాయి. మరో దఫా వాటి ధరలు రంకేస్తున్నాయి.
అమెరికాలో ఇటీవల డాలర్ బలహీనపడుతున్నా కొద్దీ బంగారం ధరలు బుల్ పరుగులు తీస్తున్నాయి. దీనికి క్రిప్టో కరెన్సీల్లో భారీ అనిశ్చితి నెలకొనడం కూడా బంగారం, వెండి ధరల పెరుగుదలకు మరో కారణం అని తెలుస్తున్నది.
బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్లో నెలలో ఆరు శాతం పెరిగితే, దేశీయంగా కిలో వెండి ధర గత నెలలో ఏడు శాతం పెరిగింది. గతేడాది బంగారం ధర 85 శాతం లబ్ధి పొందితే, వెండి ధర 28 శాతం గ్రోత్ నమోదు చేసింది.
కరోనాను నియంత్రించడానికి వివిధ రాష్ట్రాలు విధించిన లాక్డౌన్ వల్ల ఫిజికల్ గోల్డ్ విక్రయాలు పడిపోయాయి. డాలర్ బలహీనపడటంతో గత నాలుగు నెలలుగా బంగారం ధర స్థిరంగా కొనసాగుతున్నది.
గత మూడు నెలల్లో డాలర్ అతి కనిష్ట స్థాయికి పడిపోయింది. అమెరికా ప్రభుత్వ బాండ్ల ధరలు వారం కనిష్ట స్థాయికి పతనం అయ్యాయి. కామెక్స్లో (చికాగో మర్చంటైల్ ఎక్స్చేంజ్)లో ఔన్స్ బంగారం ధర 1865 డాలర్ల నుంచి 1900 డాలర్లు పలుకుతున్నది.
దేశీయంగా తులం బంగారం ధర రూ.48,400-48,900 మధ్య తచ్చాడుతున్నది. ఫిజికల్ బంగారంతోపాటు ఇన్వెస్టర్లు ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్)ల్లో కూడా పెట్టుబడులు పెట్టొచ్చు.
మంగళవారం ఎంసీఎక్స్లో బంగారం ధర జూన్ ఫ్యూచర్స్లో 0.28 శాతం తగ్గి రూ.48,415లకు చేరుకుంది. వెండి జూలై ఫ్యూచర్స్ ధర 0.81 శాతం తగ్గి రూ.71,230 వద్ద స్థిరపడింది.
రాబోయే 12 గంటల్లో అతి తీవ్ర తుఫానుగా ‘యాస్’
మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఈ నెలలో 13వ సారి పెంపు
రేపు సంపూర్ణ చంద్రగ్రహణం.. భారత్లో పాక్షికమే!
కరోనాపై మాటల్లోనే భయం.. చేతల్లో లేదు
తృణమూల్ పద్మవ్యూహంలో బీజేపీ ఉక్కిరిబిక్కిరి!
రేపు సంపూర్ణ చంద్రగ్రహణం.. భారత్లో పాక్షికమే!
చోక్సీ కొత్త ఎత్తు.. అంటిగ్వా నుంచి క్యూబాకు మకాం మార్పు!
టాటా స్టీల్ మహా ఔదార్యం.. కంపెనీపై కురుస్తున్న ప్రశంసల జల్లు
కరోనా నుండి కోలుకున్న జూనియర్ ఎన్టీఆర్
గంటకు రూ.75 కోట్లు పెరిగిన గౌతం ఆదానీ సంపద!
మలేషియాలో రెండు రైళ్ల ఢీ.. 213 మందికి గాయాలు
డైమండ్ ట్రేడర్ నుంచి.. ఆసియా బిలియనీర్ వరకూ..!!
లక్షల కోట్ల పెట్టుబడులు పెడతాం.. అనుమతించండి మోదీజీ – విస్మయం కలిగిస్తున్న పత్రికా ప్రకటన