Gold price | న్యూఢిల్లీ, మార్చి 28: గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం మళ్లీ ప్రియమైంది. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్ అధికంగా ఉండటంతో దేశీయంగా ధరలు పెరుగుతున్నాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీలో పదిగ్రాముల బంగారం ధర రూ.350 అందుకొని రూ.67,350 పిలికింది. అటు వెండి కూడా మరో రూ.200 ఎగబాకి రూ.77,450కి చేరుకున్నది.
ఇటు హైదరాబాద్లోనూ 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.350 పెరిగి రూ.61,700కి చేరుకోగా, 24 క్యారెట్ల ధర రూ.380 అధికమై రూ.67,310కి చేరుకున్నది. పసిడితోపాటు వెండి ఏకంగా రూ.80 వేలు అధిగమించింది. రూ.300 పుంజుకొని రూ.80,500 పలికింది. అమెరికా ఆర్థిక గణాంకాలు విడుదలకు ముందే బంగారం ధరలు పుంజుకున్నాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ వర్గాలు వెల్లడించాయి. గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర ఒకేరోజు 14 డాలర్లు ఎగబాకి 2,194 డాలర్లకు చేరుకున్నది.