న్యూఢిల్లీ, జూలై 27: బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం బంగారం ధర రూ.250 పెరిగి రూ.60,600 పలికింది. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు భగ్గుమనడం వల్లనే దేశీయంగా ధరలు పెరిగాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ వర్గాలు వెల్లడించాయి. పసిడితోపాటు వెండి ఏకంగా రూ.900 అధికమై రూ.77,900 పలికింది. ఇటు హైదరాబాద్లోనూ 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.330 అధికమై రూ.60,490కి చేరుకోగా, 22 క్యారెట్ల ధర రూ.300 పెరిగి రూ.55,450కి చేరుకున్నది.
అమెరి కా ఫెడరల్ రిజర్వుతోపాటు యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్లు కూడా వడ్డీరేట్లను పెంచుతూ తీసుకున్న నిర్ణయంతో మదుపరులు తమ పెట్టుబడులను సురక్షితమైన బంగారం వైపు మళ్లించడంతో వీటి ధరలు పెరిగాయన్నారు. గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 1,980 డాలర్లు, వెండి 25.03 డాలర్లు ఉన్నది.