న్యూఢిల్లీ, మార్చి 15: బంగారం ధరలు తగ్గాయి. మంగళవారం ఢిల్లీలో 10 గ్రాముల పసిడి విలువ రూ.668 దిగి రూ.51,727 వద్ద నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్లో ధరల పతనమే ఇందుకు కారణమని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. గ్లోబల్ మార్కెట్లో ఔన్సు గోల్డ్ 1,930 డాలర్లకు రాగా, ఇంతకుముందు దాదాపు 2,000 డాలర్ల వద్ద ఉన్నది. వెండి ధర సైతం 25.58 డాలర్లకు దిగజారింది. ఇదిలావుంటే కిలో వెండి ధర కూడా దేశీయ మార్కెట్లో రూ.1,390 పడిపోయి రూ.67,997 వద్ద స్థిరపడింది. ఇక హైదరాబాద్లో తులం 22 క్యారెట్ల బంగారం ధర రూ.500 దిగి రూ.47,600లుగా ఉంటే, 24 క్యారెట్లు రూ.540 పడిపోయి రూ.51, 930 గా ఉన్నది. కిలో వెండి రూ. 1,400 తగ్గి రూ.72,800లకు పరిమితమైంది.