Gold Rates | అమెరికా బ్యాంకుల దివాళా.. మరోవైపు అధిక ద్రవ్యోల్బణం.. ధరల కట్టడికి అమెరికా ఫెడ్ రిజర్వు కీలక వడ్డీరేట్లు పెంచడంతో ఇన్వెస్టర్ సెంటిమెంట్ బలహీన పడింది. ఏడు వారాల కనిష్టానికి అమెరికా డాలర విలువ పడిపోయింది. యూఎస్ ప్రభుత్వ బాండ్ల విలువ కూడా పతనమైంది. ఫలితంగా ఇన్వెస్టర్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ టూల్గా ఉన్న బంగారం వైపు మళ్లాడు. దీంతో గురువారం దేశ రాజధాని తులం బంగారం (10 గ్రాములు-24 క్యారట్లు) రూ.450 పెరిగి రూ.59,350 వద్దకు దూసుకెళ్లింది. బుధవారం ట్రేడింగ్లో తులం బంగారం ధర రూ.58,900 వద్ద స్థిర పడింది. కిలో వెండి ధర సైతం రూ.815 పెరిగి రూ.69,800 వద్ద నిలిచింది.
‘ఢిల్లీలో స్పాట్ గోల్డ్ ధర 24 క్యారట్ల బంగారం తులం రూ.45 పెరిగి రూ.59,350 వద్ద నిలిచింది’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమొడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం, వెండి ధరలు పెరిగాయి. ఔన్స్ బంగారం ధర 1975 డాలర్లు, ఔన్స్ వెండి ధర 22.84 డాలర్లు పలికింది.
ఇటీవల ఆర్థిక రంగంలో నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో యూఎస్ ఫెడ్ రిజర్వు వడ్డీరేట్లు 25 బేసిక్ పాయింట్లు పెంచడంతోపాటు భవిష్యత్లోనూ మరిన్ని వడ్డనలు తప్పవని సంకేతాలిచ్చింది. యూఎస్ ఫెడ్ రిజర్వు నిర్ణయాల వెల్లడి తర్వాత డాలర్ ఇండెక్స్ 101.6 డాలర్ల స్థాయికి పడిపోయింది. ఇది వారం కంటే తక్కువ స్థాయి. యూఎస్ పదేండ్ల ఈల్డ్ బాండ్ల ధరలు 3.5 శాతం పతనం అయ్యాయని మోతీలాల ఓస్వాల్ ఫైనాన్సియల్ సర్వీసెస్ కమొడిటీ రీసెర్చ్ సీనియర వైస్ప్రెసిడెంట్ నవ్నీత దమానీ తెలిపారు.
ఫ్యూచర్ మార్కెట్లోనూ బంగారం ధర పెరిగింది. మల్టీ కమొడిటీ ఎక్సేంజ్ (ఎంసీఎక్స్)లో ఏప్రిల్ డెలివరీ ధర రూ.533 పెరిగి రూ.59,289 వద్ద నిలిచింది. స్పాట్ గోల్డ్ పట్ల డిమాండ్ పెరిగిపోవడంతో ఫ్యూచర్ మార్కెట్లో ధర పెరుగుదలకు కారణం అన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అంతర్జాతీయంగా న్యూయార్క్లో ఔన్స్ గోల్డ్ ఫ్యూచర్ ధర 1.77 శాతం పెరిగి 2001.40.40 డాలర్లు పలికింది.
ముంబై బులియన్ మార్కెట్లో 24 క్యారట్ల బంగారం తులం ధర రూ.59,086 పలికితే, ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారట్ల బంగారం తులం రూ.58,849 వద్ద ముగిసింది. కిలో వెండి స్పాట్ ధర రూ.69,136 పలికింది.
కోల్కతా బులియన్ మార్కెట్లో తులం బంగారం (24 క్యారట్లు) ధర రూ.59,400 పలికితే, ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారట్ల బంగారం తులం ధర రూ.56,850 వద్ద స్థిర పడింది. కిలో వెండి (బార్లు) ధర రూ.69,400 పలికితే, రెడీమేడ్ రూ.69,500 వద్ద స్థిర పడింది.