Facebook Messenger : ఆర్ధిక మందగమనం, వ్యయ నియంత్రణ చర్యలు, పునర్వ్యవస్ధీకరణ, సామర్ధ్యం ఇలా పేరేదైనా ఏదో ఓ సాకుతో టెక్ దిగ్గజాలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. మెటా సీఈవో మార్క్ జుకర్బర్గ్ గత ఏడాది సామర్ధ్యంపై కంపెనీ దృష్టి సారిస్తుందని చేసిన ప్రకటన ప్రస్తుతం పలు మార్పులకు దారితీస్తోంది. మెటా సామర్ధ్య సంవత్సరం కాస్తా ఉద్యోగులపై వేటుకు దారితీయడం టెకీల్లో గుబులు రేపుతోంది.
ఫేస్బుక్ మెసెంజర్ టీం 50 మంది ఉద్యోగులపై వేటు వేసింది. ఫేస్బుక్ మెసెంజర్తో పాటు దాని కార్యకలాపాల పునర్వ్యవస్ధీకరణలో భాగంగా లేఆఫ్స్కు తెగబడినట్టు చెబుతున్నారు. లేఆఫ్స్పై వ్యాఖ్యానించేందుకు తిరస్కరించిన మెటా ప్రతినిధి కంపెనీ చేపట్టిన సామర్ధ్య సమీక్ష కొనసాగుతోందని వెల్లడించారని బిజినెస్ ఇన్సైడర్ రిపోర్ట్ పేర్కొంది. జుకర్బర్గ్ ప్రకటించిన సామర్ధ్య ఏడాది (year of efficiency) కాస్తా వేలాది కొలువుల కోతకు దారితీయడం కలకలం రేపుతోంది.
ఏడాది పాటు ఈ ప్రక్రియను ప్రకటించినా దాన్ని నిరవధికంగా పొడిగించడంతో ఏ క్షణాన ఎవరి ఉద్యోగం ఊడుతుందోనని టెకీల్లో గుబులు రేగుతోంది. ఖర్చులకు కళ్లెం వేయడం, టీమ్లను ప్రక్షాళన చేసేందుకు మేనేజర్లు చొరవ చూపుతుండటం కూడా ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది.
Read More :
Walking | వాకింగ్ చేయడం ఆరోగ్యానికి మంచిది.. అయితే రోజుకు ఎన్ని అడుగులు నడవాలంటే?