న్యూఢిల్లీ : మనీల్యాండరింగ్ కేసులో హీరో మోటోకార్ప్ చైర్మన్ పవన్ ముంజల్పై ఈడీ అధికారులు (ED Raids) కొరడా ఝళిపించారు. ఢిల్లీ, గురుగ్రామ్లోని ఆయన నివాసాలు, కార్యాలయాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
2001లో హీరో మోటోకార్ప్ ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ కంపెనీగా అరుదైన ఘటన సాధించింది. వార్షిక బైక్ విక్రయాల్లో గత 20 ఏండ్లుగా కంపెనీ ఈ ఘనతను నిలబెట్టుకుంటోంది. ఆసియా, ఆఫ్రికా, దక్షిణ, మధ్య అమెరికాల్లో విస్తరించిన దాదాపు 40 దేశాల్లో హీరో మోటోకార్ప్ కార్యకలాపాలు సాగుతున్నాయి.
పన్ను ఎగవేత ఆరోపణలకు సంబంధించి గత ఏడాది మార్చిలో ఐటీ అధికారులు హీరో మోటోకార్ప్తో పాటు కంపెనీ అధినేత పవన్ ముంజాల్ నివాసాలపై దాడులు చేపట్టారు. ఇక పవన్ ముంజల్పై ఈడీ దాడులకు సంబంధించి పూర్తి వివరాలు వెలుగు చూడాల్సి ఉంది.
Read More :