న్యూఢిల్లీ, నవంబర్ 1: జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్, ఆయన కు టుంబ సభ్యులకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గట్టి షాకిచ్చింది. లండన్, దుబాయ్, భారత్లో ఉన్న రూ.503 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. బ్యాంక్ రుణాలు ఎగ్గొట్టిన కేసులో మనీ ల్యాండరింగ్కు పాల్పడినట్టు ఈడీ విచారణలో తేలింది.
జప్తు చేసిన ఆస్తుల్లో 17 రెసిడెన్షియల్ ఫ్లాట్లు, భవంతులు, కమర్షియల్ స్థలాలు న్నాయి. జెట్ఎయిర్ ప్రైవేట్ లిమిటెడ్, జెట్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, గోయల్, ఆయన భార్య, కుమారుడు, ఇతర ఫెడరల్ ఏజెన్సీల పేరిట ఉన్న ఆస్తులను జప్తు చేసింది.