హైదరాబాద్ (చర్లపల్లి), మార్చి 14: 5జీ నెట్వర్క్ను అభివృద్ధి చేసేందుకుగాను హైదరాబాద్కు చెందిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ టెక్నాలజీ(ఐఐటీ)తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నది కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్). ఇందుకు సంబంధించి ఈసీఐఎల్ సీఎండీ రేర్ అడ్మిరల్ సంజయ్ చౌబే, హైదరాబాద్ ఐఐటీ ఉన్నతాధికారులు ఒప్పందపత్రాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ఈసీఐఎల్ సీఎండీ సంజయ్ చౌబే మాట్లాడుతూ.. సొంత సాంకేతిక పరిజ్ఞానంతో 5జీ నెట్వర్క్ను అభివృద్ధి చేయడానికి ఐఐటీ హైదరాబాద్తో కలిసి పనిచేస్తామని చెప్పారు.