ముంబై, జూన్ 23: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజూ నష్టపోయాయి. పలు దేశాల సెంట్రల్ బ్యాంక్లు మళ్లీ వడ్డీరేట్లను పెంచడానికి సమాయత్తమవుతుండటంతో పాటు గ్లోబల్ మార్కెట్లు బేరిష్ ట్రెండ్ను కొనసాగిస్తుండటంతో మదుపరులు అమ్మకాలకు మొగ్గుచూపారు. ఫలితంగా వారాంతం ట్రేడింగ్ ముగిసే సరికి 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 259.52 పాయింట్లు కోల్పోయి 62,979.37 వద్ద ముగిశాయి. ఇంట్రాడేలో 400 పాయింట్ల వరకు నష్టపోయిన సూచీ చివర్లో ఈ భారీ నష్టాలను తగ్గించుకోగలిగింది.
ఎన్ఎస్ఈ నిఫ్టీ 105.75 పాయింట్లు కోల్పోయి 18,665.50 వద్ద ముగిసింది. గ్లోబల్ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలతో సూచీలు నష్టాల్లోనే ట్రేడయ్యాయని, మార్చి తర్వాత ఒక వారంలో భారీ స్థాయిలో నష్టపోవడం ఇదే తొలిసారి. టాటా మోటర్స్ 1.77 శాతం నష్టపోయి టాప్ లూజర్గా నిలిచింది. దీంతోపాటు ఎస్బీఐ, పవర్గ్రిడ్, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, అల్ట్రాటెక్, టైటాన్, ఎల్అండ్టీ, రిలయన్స్, మారుతి షేర్లకు మదుపరుల నుంచి మద్దతు లభించలేదు.