ముంబై, జనవరి 18: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజు లాభాల్లో ముగిశాయి. బ్లూచిప్ సంస్థలైన హెచ్డీఎఫ్సీ ధ్వయం, విదేశీ పెట్టుబడిదారులు భారీగా నిధులు కుమ్మరించడంతో దేశీయ ప్రధాన సూచీ సెన్సెక్స్ తిరిగి 61 వేల మార్క్ను అధిగమించింది. రూపాయి బలపడటంతోపాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు మార్కెట్లకు ఊతమిచ్చాయి. దీంతో 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 390.02 పాయింట్లు ఎగబాకి 61,045.74 వద్దకు చేరుకోగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 112 పాయింట్లు అందుకొని 18,165.35 వద్ద స్థిరపడింది.