Duty Rise on Jewellery Import | 2022-23 వార్షిక బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బంగారం-జ్యువెల్లరీ ఆభరణాల దిగుమతులను నిరుత్సాహ పరిచేందుకు నిర్ణయం తీసుకున్నారు. జ్యువెల్లరీ ఆభరణాల దిగుమతిపై కస్టమ్స్ డ్యూటీ లిమిట్ పెంచుతున్నట్లు ప్రకటించారు. మరోవైపు, పాలిష్డ్ డైమండ్లు, జెమ్స్లపై కస్టమ్స్ డ్యూటీ ఐదు శాతానికి తగ్గించారు.
భారతీయులకు బంగారంపై ఉన్న మక్కువ అందరికీ తెలిసిందే. దేశీయ అవసరాలకు అనుగుణంగా విదేశాల నుంచి బంగారం దిగుమతి చేసుకోవాల్సిందే. దీనివల్ల కరంట్ ఖాతా లోటు పెరిగిపోయి.. ప్రభుత్వానికి చెల్లింపుల సమస్య తలెత్తుతున్నది.
సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలకు చేయూత ఇచ్చేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. స్టీల్ తుక్కుపై కస్టమ్స్ డ్యూటీ మినహాయింపు ఇచ్చారు. అలాగే దేశీయంగా పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించి మిథనాల్ వాడకాన్ని ప్రోత్సహించాలన్న ప్రభుత్వ వ్యూహంలో భాగంగానే మిథనాల్ దిగుమతిపైనా సుంకం తగ్గిస్తామని ప్రకటించారు.