Dhanteras 2021 | ధంతేరస్-దీపావళి వంటి పవిత్ర సమయంలో బంగారం కొనుగోలు చేయ తలపెట్టిన వారు హాల్మార్క్ ఆభరణాలను మాత్రమే కొనుగోలు చేయాలని కేంద్రం సూచించింది. కేంద్ర వినియోగ వ్యవహారాల విభాగం, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ (బీఐఎస్) ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన చేసింది.
బీఐఎస్ రిజిస్టర్డ్ జ్యువెల్లర్ల వద్ద మాత్రమే హాల్మార్క్డ్ బంగారం, వెండి ఆభరణాలను కొనుగోలు చేయాలని పేర్కొంది. ఒకవేళ నేరుగా చూసినప్పుడు హాల్మార్క్ సరిగ్గా కనిపించకపోతే.. సంబంధిత జ్యువెల్లరీ వ్యాపారిని మాగ్నిఫయింగ్ గ్లాస్ ఇవ్వాలని కోరాలని పేర్కొంది. ఈ ఏడాది జూన్ 23 నుంచి హాల్మార్క్ బంగారు ఆభరణాలు మాత్రమే విక్రయించాలని కేంద్రం ఆదేశించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 256 జిల్లాల్లో హాల్మార్క్ ఉన్న 14, 18, 22 క్యారెట్ల బంగారం మాత్రమే కొనుగోలు చేయాలని ఆదేశాలు అమలులోకి తెచ్చింది. ఈ జిల్లాల్లో మాత్రమే హాల్మార్కింగ్ కేంద్రాలు ఉన్నాయి.
అలాగే కొనుగోలుదారులు తమ బంగారం కొనుగోళ్లపై బిల్లు ఇవ్వాలని జ్యువెల్లరీ వ్యాపారులను కోరాలని కేంద్రం తెలిపింది. బీఐఎస్ మార్క్ కింద క్యారట్ ప్యూరిటీ, గోల్డ్ ఫిట్నెస్, ఆరు నంబర్ల ఆల్ఫాన్యూమరిక్ హెచ్యూఐడీ కోడ్ ఉండాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
myrtle corbin | నాలుగు కాళ్లు.. రెండు జననేంద్రియాలు.. ఆమె పుట్టుక ఇప్పటికీ మిస్టరీనే
Tavolara | ఆ రాజ్యంలో ఉండేది కేవలం 11 మందే.. మరి రాజుగారి పనేంటో తెలుసా !
అబ్రహం లింకన్ గడ్డం పెంచడం వెనుక ఉన్న కథేంటో తెలుసా !