Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళశారం ఫ్లాట్గా ముగిశాయి. ఉదయం స్వల్ప లాభాలతో మొదలైన సూచీలు ఆ తర్వాత స్వల్పంగా దిగజారాయి. చివరకు స్వల్పంగా కోలుకొని ఫ్లాట్గా ముగిశాయి. సెన్సెక్స్ క్రితం సెషన్తో పోలిస్తే.. 81,575.96 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైంది. ఇంట్రాడేలో 81,726.34 పాయింట్లకు పెరిగిన సెన్సెక్స్.. చివరకు 81,182.69 పాయింట్లకు తగ్గింది. చివరక 1.59 స్వల్పంగా పెరిగి.. 81,510.05 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 8.95 పాయింట్లు తగ్గి.. 24,610.05 వద్ద ముగిసింది.
ట్రేడింగ్లో దాదాపు 1,970 షేర్లు పెరిగాయి. 1,828 షేర్లు పతనమై.. మరో 122 షేర్లు మాత్రం మారలేదు. సెన్సెక్స్లో భారతీ ఎయిర్టెల్, అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, హెచ్డీఎఫ్సీ లైఫ్ టాప్ లూజర్గా నిలిచాయి. బజాజ్ ఫిన్సర్వ్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, విప్రో, శ్రీరామ్ ఫైనాన్స్ లాభపడ్డాయి. బీఎస్ఈ మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు 0.3శాతం చొప్పున పెరిగాయి. పవర్, టెలికాం, మీడియా 0.5శాతం నుంచి ఒకశాతం పతనం కాగా.. ఐటీ, మెటల్, పీఎస్యూ బ్యాంక్, రియల్టీ 0.4-1 శాతం మధ్య ఎగిశాయి.