Stocks | ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర నేపథ్యంలో వారం రోజులుగా నష్టాలను మూటగట్టుకున్న దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం పుంజుకున్నాయి. శుక్రవారం ట్రేడింగ్లో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ) ఇండెక్స్ సెన్సెక్స్ 1328.61 పాయింట్ల లాభంతో 55858.52 పాయింట్ల వద్ద ముగిసింది. మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ కూడా 410.45 పాయింట్ల లబ్ధితో 16,658.30 పాయింట్ల వద్ద స్థిర పడింది.
ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్య వల్ల గురువారం ట్రేడింగ్లో భారీగా నష్టపోయిన ఇన్వెస్టర్లు శుక్రవారం సగం రాబట్టుకున్నారు. శుక్రవారం ఉదయం 55321 పాయింట్ల వద్ద మొదలైన ట్రేడింగ్ ఇంట్రాడేలో56,183.70 పాయింట్ల గరిష్ఠానికి దూసుకెళ్లి.. 55,299 పాయింట్ల కనిష్ఠం వరకు పడిపోయింది. తిరిగి ట్రేడింగ్ ముగిసే సమయానికి పుంజుకుని 1328.61 పాయింట్ల లబ్ధితో ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 16,515 పాయింట్ల వద్ద ట్రేడింగ్ మొదలైంది. 16748-16,478 పాయింట్ల మధ్య నిఫ్టీ ట్రేడింగ్ సాగింది.