Air India Crisis | టాటా సన్స్ నుంచి ఎయిర్ ఇండియా (ఏఐ)ను జాతీయకరణ చేశాక.. 1990వ దశకంలో ఆ సంస్థకు కష్టాలు మొదలయ్యాయి. దేశీయ విమానయాన రంగంలో ప్రైవేట్ రంగానికి అవకాశాలు కల్పిస్తూ 1994-95లో అప్పటి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ప్రైవేట్ ఎయిర్లైన్స్ చౌక ధరకే విమానయానాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చాయి. దీంతో నాటి నుంచి దేశీయ విమానయాన రంగంలో ఎయిర్ ఇండియా క్రమంగా తన మార్కెట్ షేర్ను కోల్పోతూ వచ్చింది.
అటల్ బిహారీ వాజపేయి సారధ్యంలో ఎన్డీఏ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు 2000-01లో ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ, పెట్టుబడుల ఉపసంహరణకు ప్రయత్నం జరిగింది. ఎయిర్ ఇండియాలో మైనారిటీ వాటా 40 శాతం విక్రయించడానికి నాటి వాజపేయి సర్కార్ ప్రయత్నించింది.
ఈ మేరకు 40 శాతం వాటాలను కొనుగోలు చేసేందుకు టాటా సన్స్ గ్రూప్తో కలిసి సింగపూర్ ఎయిర్లైన్స్ ముందుకు వచ్చింది. కానీ ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణకు ఉద్యోగ, కార్మిక సంఘాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో సింగపూర్ ఎయిర్లైన్స్ తన ప్రతిపాదనను ఉపసంహరించుకుంది. తత్ఫలితంగా ఎయిర్ ఇండియాలో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ నిలిచిపోయింది.
తర్వాత పదేండ్ల పాటు కాంగ్రెస్ పార్టీ సారధ్యంలోని యూపీఏ ప్రభుత్వం 2004-14 వరకు ఎయిర్ ఇండియాతో సహా ప్రైవేటీకరణ ఎజెండాను ముందుకు తీసుకెళ్లలేకపోయింది. దీనికి తోడు 2012లో ఎయిర్ ఇండియాను ఆదుకునేందుకు ఆర్థిక పునర్వ్యవస్థీకరణ ప్రణాళిక (ఎఫ్ఆర్పీ)ను ఆమోదించింది. ఇండియన్ ఎయిర్లైన్స్ను 2007-08లో విలీనం చేసినప్పటి నుంచి ప్రతియేటా ఎయిర్ ఇండియా నష్టాల బారీన పడింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Air India | ఎయిరిండియా అప్పులు రూ.60వేల కోట్ల పైచిలుకే!
Air India to TATA | ఏడాదిపాటు ఎయిరిండియా ఉద్యోగులకు నో ఉద్వాసన
వెల్కమ్ బ్యాక్, ఎయిర్ ఇండియా.. రతన్ టాటా ట్వీట్
Air India to TATA’s | టాటా చేతికే మహారాజా..