న్యూఢిల్లీ, ఆగస్టు 15: క్రూడాయిల్ను ఉత్పత్తి చేస్తున్న సంస్థలకు కేంద్ర ప్రభుత్వం మరోసారి షాకిచ్చింది. పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్లపై విండ్ఫాల్ ట్యాక్స్ను పెంచింది. దేశీయంగా ఉత్పత్తి అవుతున్న క్రూడాయిల్ టన్ను ధరను రూ.4,250 నుంచి రూ.7,100కి సవరించింది.
అలాగే ఇతర దేశాలకు ఎగమతయ్యే డీజిల్పై విధిస్తున్న ప్రత్యేక ఎక్సైజ్ డ్యూటీని రూ.1 నుంచి రూ.5.50కి పెంచింది. అలాగే మంగళవారం నుంచి ఎగమతయ్యే విమాన ఇంధనంపై ట్యాక్స్ను లీటర్కు రూ.2 చొప్పున విధిస్తున్నది.