పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్! 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఐటీ రిటర్నుల ఫారంలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సేషన్ (సీబీడీటీ) గురువారం నోటిఫై చేసింది. ఐటీఆర్-1 నుంచి ఐటీఆర్-7 వరకు కొత్త ఫారంలను ఏప్రిల్1న విడుదల చేసింది. అయితే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కొత్త ఫారంలలో చెప్పుకోగదగ్గ మార్పులేమీ చేయలేదు. కరోనా సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని పన్ను చెల్లింపుదారుల సౌలభ్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీబీడీటీ తెలిపింది. ఆదాయపు పన్ను చట్టం 1961 సవరణలకు అనుగుణంగా అవసరమైన కనీస మార్పులను మాత్రమే చేసినట్లు వెల్లడించింది. ఫారంలలో తొలుత కొత్త ఐటీ ఫారం ఫైల్ చేయాలని అనుకుంటున్నారా అనే ప్రశ్న మాత్రం వస్తుందని తెలియజేసింది.
ఐటీఆర్ 1లో పన్ను అసెసీలు త్రైమాసికానికి తాము అందుకున్న డివిడెండును పేర్కొనాల్సి ఉంటుంది. అధిక సంఖ్యలో ఉండే చిన్న, మధ్యతరహా పన్ను చెల్లింపుదారులకు ఐటీఆర్ ఫారం 1 (సహజ్), ఐటీఆర్ ఫారం 4 (సుగమ్) ఉపయోగపడతాయి. ఈ ఐటీఆర్ 1 నుంచి 7 వరకు ఫారంలు ఎవరికి ఏవి ఉపయోగపడతాయో ఒకసారి చూద్దాం..
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి