న్యూఢిల్లీ, డిసెంబర్ 11: బీఎండబ్ల్యూ కూడా వాహన ధరలను పెంచేసింది. వచ్చే నెల 1 నుంచి అమలులోకి వచ్చేలా అన్ని రకాల వాహన ధరలను 2 శాతం సవరిస్తున్నట్టు బీఎండబ్ల్యూ గ్రూపు ఇండియా ప్రెసిడెంట్ విక్రమ్ పవాహ్ తెలిపారు.
ఉత్పత్తి వ్యయం పెరగడంతోపాటు ఫారెక్స్ మార్కెట్లో కరెన్సీలు తీవ్ర హెచ్చుతగ్గుదలకు లోనుకావడంతో ధరలు పెంచాల్సి వచ్చిందన్నారు.