న్యూఢిల్లీ, ఆగస్టు 3: దేశీయ టెలికం దిగ్గజాల్లో ఒకటైన భారతీ ఎయిర్టెల్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్తో ముగిసిన త్రైమాసికానికిగాను రూ.1,612 కోట్ల నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలోనూ ఇంతే స్థాయిలో లాభాన్ని గడించింది. లాభాల్లో నిరాశపరిచిన సంస్థ ఆదాయం మాత్రం రెండంకెల వృద్ధి నమోదైంది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 14 శాతం ఎగబాకి రూ.37,440 కోట్లు ఆర్జించింది. భారత్లో మొబైల్ సేవలు అందించడంతో వచ్చే ఆదాయంలో 12.4 శాతం వృద్ధి నమోదైంది. సరాసరిగా ఒక్కో కస్టమర్ నుంచి వచ్చే ఆదాయం రూ.183 నుంచి రూ.200కి పెరిగినట్లు వెల్లడించింది.
‘టెలికం రంగంలో పోటీ పెరిగినప్పటికీ ఈ త్రైమాసికంలో ఆశాజనక పనితీరు కనబరిచాం. కస్టమర్కు నాణ్యమైన సర్వీసులకు పెద్దపీట వేయడంతో గత త్రైమాసికంలో 56 లక్షల మంది 4జీ కస్టమర్లు చేరారు.ఒక త్రైమాసికంలో ఇంతటి స్థాయిలో కస్టమర్లు చేరడం ఇదే తొలిసారి’
– గోపాల్ విఠల్, భారతీ ఎయిర్టెల్ ఎండీ