Card less Cash | న్యూఢిల్లీ, జూలై 3: బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ.. తమ ఖాతాదారులకు 68వ బ్యాంక్ డే సందర్భంగా పలు కొత్త సర్వీసులను ప్రకటించింది. ఇందులో ఏ బ్యాంక్/సంస్థ ఏటీఎం నుంచైనా ఇకపై ఎస్బీఐ కస్టమర్లు కార్డు లేకుండానే నగదును తీసుకునే అవకాశాన్నిచ్చింది. ఇప్పటిదాకా ఈ సదుపాయం కేవలం ఎస్బీఐ ఏటీఎంల్లోనే కల్పించింది.
ఈ మేరకు బ్యాంక్ యాప్ ‘యోనో’ను అప్గ్రేడ్ చేసింది. కాగా, ఇతర బ్యాంకుల ఖాతాదారులూ యూపీఐ లావాదేవీల కోసం యోనో యాప్ను వాడుకునేలా ఎస్బీఐ మార్పులు చేసింది. ఈ క్రమంలోనే ‘యోనో ఫర్ ఎవ్రీ ఇండియన్’ థీమ్ను తీసుకొచ్చింది. స్కాన్, పే, పే బై కాంటాక్ట్స్, రిక్వెస్ట్ మనీ వంటి సదుపాయాలన్నీ ఇందులో ఉంటాయని ఎస్బీఐ వివరించింది.