ATM Charges From 2022 | ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం వివిధ బ్యాంకుల ఖాతాదారులు తమ సొంత బ్యాంకుతోపాటు ఇతర బ్యాంకుల ఏటీఎంల వద్ద పరిమితికి మించి చేసే విత్డ్రాయల్స్పై చార్జీలు పెరుగనున్నాయి. పెరిగిన సాధారణ ఖర్చులతోపాటు అధిక ఇంటర్ చేంజ్ ఫీజు భర్తీ చేసుకునేందుకు వీలుగా కస్టమర్ల నుంచి చార్జీలు వసూలు చేసేందుకు బ్యాంకులకు ఆర్బీఐ ఇప్పటికే అనుమతి ఇచ్చింది. కనుక వివిధ బ్యాంకుల ఏటీఎంల వద్ద నెలవారీ ఉచిత పరిమితిని మించి జరిపే లావాదేవీలపై చార్జీలు 2022 జనవరి నుంచి పెరుగనున్నాయి.
ఈ క్రమంలోనే ప్రైవేట్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ వచ్చేనెల ఒకటో తేదీ నుంచి ఏటీఎం చార్జీలు పెంచుతున్నట్లు ప్రకటించింది. తమ ఖాతాదారులు గానీ, ఇతర బ్యాంకుల ఖాతాదారులు గానీ ఉచిత పరిమితి దాటి చేసే నగదు విత్డ్రాయల్స్, డిపాజిట్ లావాదేవీలపై ప్రతి ట్రాన్సాక్షన్కు రూ.21 ఫీజుతోపాటు జీఎస్టీ వసూలు చేయనున్నట్లు తెలిపింది.
బ్యాంకు ఖాతాదారులు తమ సొంత బ్యాంక్ ఏటీఎం మిషన్ల నుంచి ప్రతి నెలా ఐదు ఉచిత లావాదేవీలు జరుపొచ్చు. మెట్రో నగరాల పరిధిలో ఇతర బ్యాంక్ ఏటీఎమ్లలో మూడు, నాన్-మెట్రో నగరాలలో ఐదు ఉచిత ట్రాన్సాక్షన్స్ చేయవచ్చు. ఈ పరిమితికి మించి జరిపే ప్రతి లావాదేవీపై ఇంటర్చేంజ్ ఫీజు రూ.15 నుంచి రూ. 17, ఆర్థికేతర లావాదేవీలకు రూ. 5 నుంచి రూ. 6 వరకు పెంచడానికి ఆర్బీఐ అనుమతించింది. ఈ ఏడాది ఆగస్టు ఒకటో తేదీ నుంచి ఈ నిబంధనల అమల్లోకి వచ్చింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Mehendi Blouse : చీర కట్టింది కానీ నో జాకెట్.. మెహందీతో బ్లౌజ్ డిజైన్.. నెటిజన్లు చూసి షాక్
వ్యాక్సిన్ వేయించుకుంటే డేటింగ్ చేస్తా.. యువతి బంపర్ ఆఫర్.. ఎక్కడో తెలుసా?
jayabharathi |ఆడవాళ్లు డ్రైవింగ్ నేర్చుకుని ఏం చేస్తారనే ప్రశ్నకు ఇదే నా జవాబు
3 అడుగుల వరుడు.. 2 అడుగుల వధువు.. 7 అడుగుల బంధం
అరుదైన రెండు తలల బల్లిని చూశారా ఎప్పుడైనా?.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు.. వైరల్ వీడియో