Demand for Homes in Hyd | చిన్న వయస్సులోనే ఉద్యోగాల్లో చేరడం.. ఆదాయాలు పెరగడంతో ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టడానికి ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. రూ.75 లక్షల నుంచి రూ.కోటి వరకు మదుపు చేయడానికి సిద్ధం అవుతున్నారు. ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగర పరిధిలో రూ.కోటి పైగా విలువ గల ఆస్తులను సొంతం చేసుకోవడానికి కూడా వెనుకాడటం లేదు. 26-40 ఏండ్ల మధ్య వయస్సు గల యువత తమ ఆసక్తులు.. ఆకాంక్షలు, డ్రీమ్స్ మేరకు రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ కొనుగోలు చేయడానికి మొగ్గుతున్నారు. పలువురు ఇండ్ల కొనుగోలు దారులకు రూ.కోటి వరకు వెచ్చించి ఇండ్లు కొనుగోలు చేయడం చౌక ధరేనని భావిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు.
ఒకసారి ఉద్యోగం పొందిన వారిలో చాలా మంది ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టడానికి మొగ్గు చూపుతున్నారు. కొద్ది సంవత్సరాలుగా ప్రారంభంలోనే భారీ వేతనాలు పొందుతుండటంతో రూ.75 లక్షల నుంచి రూ.కోటి వరకు ఇన్వెస్ట్ చేయడానికి వెనుకాడటం లేదు. బ్యూటిఫుల్ ఇంటిరియర్స్, లార్జ్ బాల్కానీ స్పేస్, గేటెడ్ కమ్యూనిటీ ఏరియాలో మెరుగైన ఇతర వసతులు ఉంటే రూ.కోటికి పైగా పెట్టుబడి పెట్టడానికి సిద్ధం అవుతున్నారు.
తొలిసారి ఇండ్ల కొనుగోలు దారులు గానీ.. ఇప్పటికే ఇల్లు ఉన్న వారు గానీ తమ పాత ఇండ్లను విక్రయించి మరీ తమ ఆకాంక్షలకు అనుగుణంగా మెరుగైన వసతులు గల భారీ స్పేస్ గల అపార్ట్మెంట్ ప్లాట్ల కొనుగోలుకు ముందుకు వస్తున్నారు. హైదరాబాద్లో ప్రస్తుతం 57 శాతం మంది రూ.75 లక్షలు.. అంతకంటే ఎక్కువ మొత్తం ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తున్నారని ప్రాప్ టైగర్స్ రియల్ ఇన్సైట్ రెసిడెన్షియల్ రిపోర్ట్ పేర్కొంది. అయితే రూ.45-75 లక్షల మధ్య ధర గల ఇండ్లకు ఇంకా డిమాండ్ ఉంది. అయితే, వీటిని సెకండ్ హోమ్స్గా పరిగణిస్తున్నారని అంటున్నారు.
గత కొన్ని సంవత్సరాలుగా రూ.60 లక్షల నుంచి రూ.కోటి వరకు విలువ గల ఇండ్లకు డిమాండ్ పెరుగుతున్నది. చిల్డ్రన్స్ ప్లే ఏరియా, క్లబ్ హౌస్, సెక్యూరిటీ తదితర అదనపు వసతులు ఉన్న ఇండ్ల కోసం ఫస్ట్టైం ఇండ్ల కొనుగోలుదారులు, సెకండ్ ప్రాపర్టీ బయ్యర్స్ వెతుకుతున్నారు. వాసవి గ్రూప్ డైరెక్టర్ కే శ్రీనివాసులు మాట్లాడుతూ హైదరాబాద్లో అత్యధిక ఇండ్ల సగటు ధర చదరపు అడుగుకు రూ.5000 పైనే పలుకుతుందన్నారు.
హైదరాబాద్ నగరానికి ఐటీ కారిడార్గా భావిస్తున్న వెస్ట్రన్, నార్త్ వెస్ట్రన్కారిడార్, నార్త్ కారిడార్లలో నివాస ఇండ్లు సాచురేటెడ్ స్థాయికి చేరిందన్న అంచనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దుండిగల్, బాచుపల్లి, మియాపూర్, తెల్లాపూర్ ప్రాంతాల్లో ఇండ్ల ధరలకు రెక్కలొచ్చాయి. ఏడాది ప్రాతిపదికన ఐదు శాతం ధరలు పెరిగాయి. దుండిగల్లో చదరపు అడుగు ధర రూ.3700-3,900, గండిపేట, బాచుపల్లి, మియాపూర్, తెల్లాపూర్ ప్రాంతాల్లో రూ.4,900 నుంచి రూ.6,200 పలుకుతోంది. ఐటీ కారిడార్ ప్రాంతాల్లో బెటర్ రోడ్డు కనెక్టివిటీ తదితర వసతులకు ప్రాధాన్యం పెరుగుతున్నది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Bhagyasree Daughter | జూనియర్ భాగ్యశ్రీ ఎంట్రీకి లైన్క్లియర్..!
SBI Alert | ఖాతాదారులకు ఎస్బీఐ హెచ్చరిక.. అదేమిటంటే?!
5G Auction | ఏప్రిల్-మేలో 5జీ స్పెక్ట్రం వేలం.. ట్రాయ్లోనూ మార్పులు!
క్రిప్టోకరెన్సీలతో ఆర్ధిక వ్యవస్ధకు ముప్పు : ఆర్బీఐ గవర్నర్