Apple India | మొబైల్ ఫోన్లలో ఐఫోన్కు ఉండే ఆ క్రేజే వేరు. ఆ ఫోనంటే భారతీయులకు సైతం మక్కువే. దీన్ని దృష్టిలో పెట్టుకొని యాపిల్ భారత్లో రెండు స్టోర్లను ప్రారంభించింది. దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబయి మహానగరాల్లో స్టోర్లను ఏర్పాటు చేయగా.. రికార్డు స్థాయిలో విక్రయాలు జరిగాయి. ఓ రిపోర్ట్ ప్రకారం.. ఆపిల్ ఇండియా ప్రారంభ నెలలోనే దాదాపు రూ.25కోట్ల విక్రయాలు జరిగాయి.
దీపావళి వంటి పండుగ సీజన్లు లేకపోయినప్పటికీ ఆపిల్ భారీ ఆదాయాన్ని ఆర్జించింది. ముంబయి, ఢిల్లీ స్టోర్లు రెండు ప్రారంభించిన వారం రోజుల్లోనే భారీగా విక్రయాలు జరిగాయని నివేదిక పేర్కొంది. ముంబయి స్టోర్ ప్రారంభోత్సవం రోజు రూ.10కోట్లకు విక్రయాలు జరిగాయి. ముంబయి బాద్రాకుర్లాలో ఆపిల్ బీకేసీతో ఏర్పాటు స్టోర్ను తొలిరోజు 6వేల మందికిపైగా సందర్శించారు.
మరో వైపు కంపెనీ కొత్త మోడల్స్ను తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నది. iPhone 15, Apple Watch Series 9, కొత్త Macను త్వరలోనే ప్రకటించే అవకాశాలున్నాయి. ఈ స్టోర్లలో అన్ని కొత్త మోడల్స్ను విడుదల చేయనున్నది. ప్రస్తుతం ఆపిల్కు భారత్ కీలక మార్కెట్గా ఉన్నది. దేశంలో కంపెనీ విక్రయాలు భారీగా పెరిగాయి. మరో వైపు భారత్లో ఐఫోన్ ఉత్పత్తిని పెంచేందుకు కంపెనీ సన్నాహలు చేస్తున్నది. ఐప్యాడ్, ఎయిర్పాడ్లను అసెంబ్లింగ్ ప్రారంభించాలని యోచిస్తున్నది.