న్యూఢిల్లీ : భారత్లో ప్రైమ్ డే సేల్ ఈవెంట్ను (Amazon Prime Day sale) నిర్వహించేందుకు ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సంసిద్ధమైంది. జులై 15 నుంచి రెండు రోజుల పాటు ఈ సేల్ సాగుతుందని భావిస్తున్నారు. ప్రైమ్ డే సేల్కు సంబంధించి అమెజాన్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. గత ఏడాది అమెజాన్ ప్రైమ్ డే సేల్ జులై 23న ప్రారంభమై 24న ముగిసింది. ఈ ఏడాది కొద్దిగా ముందుగానే ప్రైమ్ డే సేల్ నిర్వహణకు ఈ-కామర్స్ దిగ్గజం కసరత్తు సాగిస్తోందని సమాచారం.
ప్రైమ్ డే సేల్ ఈవెంట్లో నిర్ధిష్టంగా ఎలాంటి డీల్స్ను వెల్లడించకున్నా గత ఏడాది సేల్ ఆధారంగా హాట్ డీల్స్, ఆఫర్లపై పలు అంచనాలు సాగుతున్నాయి. లేటెస్ట్ స్మార్ట్ఫోన్లపై ఈ సేల్లో ఆకర్షణీయ ఆఫర్లు, డిస్కౌంట్లు అందుబాటులోకి రానున్నాయి. నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్, ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ల ధరల తగ్గింపు సహా ఎన్నో హాట్ డీల్స్ లభించనున్నాయి. గతంలో షియామి, శాంసంగ్, రియల్మీ, ఐక్యూఓఓ, ఓప్పో వంటి పలు బ్రాండ్ల స్మార్ట్ఫోన్లపై అద్భుతమైన డీల్స్ కస్టమర్లను ఆకట్టుకున్నాయి.
ఇదే తరహాలో వన్ప్లస్, శాంసంగ్ సహా పాపులర్ బ్రాండ్స్ ప్రోడక్ట్స్లపైనా హాట్ డీల్స్ కస్టమర్లను అలరించనున్నాయి.ల్యాప్టాప్లు, స్మార్ట్టీవీ క్యాటగిరీల్లోనూ పలు ప్రోడక్ట్స్పై ఆకర్షణీయ తగ్గింపు లభించనుంది. హెడ్ఫోన్లు, స్పీకర్లు, సౌండ్బార్లు వంటి ప్రోడక్ట్స్పైనా ప్రైమ్ డే సేల్ సందర్భంగా తగ్గింపు ధరలు అందుబాటులో ఉండనున్నాయి. ఇక ఫైర్ టీవీ స్టిక్ లైట్, ఎకో షో 5, ఎకో షో 8, కిండిల్ ఒయాసిస్ వంటి పాపులర్ అమెజాన్ డివైజ్లపై గత ఏడాది మాదిరే పలు ఆఫర్లను ఈ ఏడాది సైతం ఆశించవచ్చు.
Read More :
OnePlus Nord 3 | జులై 5న వన్ప్లస్ నార్డ్ 3, నార్డ్ సీఈ 3 లాంఛ్..హాట్ ఫీచర్లివే..!