న్యూఢిల్లీ : వన్ప్లస్ దేశీ మార్కెట్లో జులై 5న లేటెస్ట్ స్మార్ట్ఫోన్లు వన్ప్లస్ నార్డ్ 3 5జీ (OnePlus Nord 3), వన్ప్లస్ నార్డ్ సీఈ 3 5జీ, వన్ప్లస్ నార్డ్ బడ్స్ 2ఆర్, వన్ప్లస్ బీడబ్ల్యూజడ్2 ఏఎన్సి వంటి నాలుగు న్యూ ప్రోడక్ట్స్ను లాంఛ్ చేయనుంది. వచ్చే నెల 5న వన్ప్లస్ నార్డ్ సమ్మర్ లాంఛ్ ఈవెంట్ సందర్భంగా లేటెస్ట్ స్మార్ట్ఫోన్లను వన్ప్లస్ లాంఛ్ చేయనుంది.
వన్ప్లస్ నార్డ్ 3 5జీ ఫ్లాట్ డిస్ప్లే, అలర్ట్ స్లైడర్ వంటి ఫీచర్లతో గ్రే, మిస్టీ గ్రీన్ కలర్ ఆప్షన్స్లో కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది. ఇక నార్డ్ 3 5జీ 6.74 ఇంచ్ ఫుల్హెచ్డీ+ అమోల్డ్ డిస్ప్లేతో ఆకట్టుకోనుంది. రియర్ కెమెరా సెటప్లో 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 8ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా, 2ఎంపీ మ్యాక్రో కెమెరాతో రానుంది. లీకయిన స్పెసిఫికేషన్ల ప్రకారం ఈ స్మార్ట్ఫోన్ అండ్రాయిడ్ 13 ఓఎస్పై రన్ అవుతుంది.
అండర్ డిస్ప్లే ఫింగర్ప్రింట్ స్కానర్, డైమెన్సిటీ 9000 ఎస్ఓసీ చిప్సెట్తో కస్టమర్ల ముందుకు రానుంది. స్టాండర్డ్ వేరియంట్ రూ. 32,999కి అందుబాటులో ఉండగా, 16జీబీ, 256జీబీ స్టోరేజ్ మోడల్ రూ. 36,999కి లభిస్తుంది. ఇక వన్ప్లస్ నార్డ్ సీఈ 3 5జీ క్వాల్కాం స్నాప్డ్రాగన్ 782జీ చిప్సెట్తో ఫాస్ట్చార్జింగ్ సపోర్ట్తో 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగిఉంటుంది. ఈ స్మార్ట్ఫోన్ 6.7 ఇంచ్ ఫ్లూయిడ్ అమోల్డ్ డిస్ప్లేతో వెనుకభాగంలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్)తో 50ఎంపీ ఐఎంఎక్స్ ప్రైమరీ సెన్సర్ ఆకట్టుకోనుంది. ఇక బడ్స్ 2ఆర్ బ్లాక్, బ్లూ కలర్ ఆప్షన్స్లో లభిస్తాయని కంపెనీ పేర్కొంది.
Read More