న్యూఢిల్లీ, అక్టోబర్ 20: రిలయన్స్ జియో వినియోగదారులను ఆకట్టుకోవడంలో దూసుకుపోతున్నది. ఆగస్టు నెలలోనూ కంపెనీ నెట్వర్క్లోకి 6.49 లక్షల మంది చేరా రు. ఈ విషయాన్ని టెలికం నియంత్రణ మండలి ట్రాయ్ తాజాగా వెల్లడించింది. భారతీ ఎయిర్టెల్ పరిధిలోకి 1.38 లక్షల మంది చేరినట్లు తెలిపింది. వొడాఫోన్ ఐడియా మాత్రం 8.33 లక్షల మంది సబ్స్ర్కైబర్లను కోల్పోయింది. ప్రస్తుతం జియోకు 44.38 కోట్ల మంది సబ్స్ర్కైబర్లు ఉండగా, ఎయిర్టెల్కు 35.41 కోట్లు, వొడాపోన్కు 27.10 కోట్ల మంది ఉన్నారు.