పాలకుర్తి/జనగామ : సకల జనుల సమానత్వమే బసవన్న తత్త్వం అని తెలంగాణ అర్చక ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి రాష్ట్ర కన్వీనర్ దేవగిరి వెంకటరాజేశ్వర శర్మ పేర్కొన్నారు. సోమనాథ కళాపీఠం అధ్వర్యంలో పాలకుర్తి శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణంలో శుక్రవారం విశ్వగురు బసవ 888వ జయంతి కొవిడ్ నిబంధనలు పాటిస్తూ జరిగింది. డాక్టర్ రాపోలు సత్యనారాయణ కార్యక్రమానికి అధ్యక్షత వహించగా డీవీఆర్ శర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
బసవేశ్వర విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం వెంకటరాజేశ్వర శర్మ మాట్లాడారు.
బసవన్న ప్రబోధించిన కాయక, దాసోహ సుగుణాలు నీతివంతమైన సమాజ నిర్మాణానికి దోహదపడుతాయని ఆయన అభివర్ణించారు. విశిష్ట అతిథి ప్రధానార్చకులు దేవగిరి రామన్న లింగార్చన అధికారాన్ని అందరికి అందించిన సంస్కర్త బసవన్న అని కొనియాడారు.
బసవపురాణం రాసిన మహాకవి పాలకురికి సోమనాథుని జన్మస్థలాన్ని సీఎం కేసీఆర్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధి చేస్తున్నారని ప్రశంసించారు.
కార్యక్రమంలో దేవస్థాన ఈ వో వీరస్వామి, సూపరింటెండెంట్వెం కటయ్య, అర్చక బృందం దేవగిరి లక్ష్మన్న, అనిల్ కుమార్, నాగరాజు, సంతోష్, శ్యాం, సిబ్బంది బండారి శ్రీనివాసులు, నవీన్, సైదమ్మ, వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం జనగామ జిల్లా అధ్యక్షుడు బక్కెర సిద్ధయ్య, పాలకుర్తి మండల గౌరవ అధ్యక్షుడు బక్కెర రవి, సోమనాథ కళాపీఠం గౌరవ సలహాదారు వి వెంకటేశ్వర రావు, అధ్యక్షురాలు రాపోలు శోభారాణి, కోశాధికారి ఇమ్మడి దామోదర్, మామిండ్ల రమేశ్ రాజా, గూడూరు లెనిన్, మేరుగు మధుసూదన్, రాపోలు సోం సాయి, గజ్జి సంతోష్, చిక్కమఠం పర్వతయ్య, భరత్, జి నరేందర్ రెడ్డి, పుట్ట అంజనేయులు, ఇప్పకాయల క్రాంతి పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
విషాదం : పిడుగుపాటుకు తండ్రి, కొడుకు మృతి
పిడుగుపాటుకు మేకల కాపరి, మేకలు మృతి
దార్శనికుడు బసవేశ్వరుడు : మంత్రి శ్రీనివాస్ గౌడ్
పుల్లూరు వద్ద నిలిచిపోయిన ఏపీ అంబులెన్స్లు
జోగులాంబ జిల్లాలో కర్నాటక సరిహద్దులు మూసివేత