ఇల్లెందు: సింగరేణిలో విధులు నిర్వహిస్తున్నఉద్యోగులు, కార్మికులకు సింగరేణిసంస్ధ అండగా ఉంటుందని జీఎం మల్లెల సుబ్బారావు అన్నారు. సోమవారం జీఎం కార్యాలయంలో కరోనాతో మృతిచెందిన ఉద్యోగి భార్యకు రూ.15 లక్షల ఎక్స్గ్రేషియా చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ ఇల్లెందు ఏరియా 21 గనిలో ఎల్హెచ్డీ ఆపరేటర్గా పనిచేసున్న మహ్మద్ మహబూబ్ అనే ఉద్యోగి ఇటీవలే కరోనా బారిన పడి మృతిచెందాడన్నారు.
కరోనా వ్యాధి సోకి మృతిచెందిన సింగరేణి ఉద్యోగుల కుటుంబాలకు యాజమాన్యం ప్రత్యేకంగా రూ.15 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించిందన్నారు. అలాగే కుటుంబంలో అర్హులైన ఒకరికి ఉద్యోగం ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వోటూజీఎం బండి వెంకటయ్య, ఏజీఎం ప్రభాకర్రావు, డీజీఎం పర్సనల్ జీవీ మోహన్రావు, ఎస్టేట్ అధికారి తావుర్యనాయక్, ఫిట్ కార్యదర్శి సంజీవరావు, జూనియర్ అసిస్టెంట్ రవి తదితరులు పాల్గొన్నారు