భద్రాచలం: భద్రాచలం దేవస్థానంలోని ఆస్థానాచార్యులు కేఈ స్థలశాయికి అరుదైన గౌరవం లభించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో ఆగమ సలహా మండలిలో ఆయనకు స్థానం కల్పించింది. ఈ ఆగమ సలహా మండలిలో పలు ఆగమాలకు చెందిన పండితులను సభ్యులుగా నియమించారు. అందులో భాగంగా భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో ఆస్థాన స్థానాచార్యులుగా విధులు నిర్వహిస్తున్నకేఈ స్థలశాయికి మండలిలో స్థానం కల్పించడం జరిగింది.
కర్ణాటక శాస్త్రీయ సంగీతం గాత్ర విభాగంలో డిప్లోమాతో పాటు, వీణ వాయిద్యంలో కూడా ఆయనకు ప్రవేశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు ఆగమ సలహా మండలిలో స్థానం కల్పించడం పట్ల దేవస్థానం అధికారులు, వేద పండితులు, అర్చకులు ఆయనను అభినందించారు.