భద్రాద్రి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మణుగూరు హెవీ వాటర్ ప్లాంట్లో నూతనంగా ఏర్పాటు-చేసిన ఓ-18 ప్లాంటు-లో ఉత్పత్తి ప్రారంభమైంది. దీనిని డి.ఏ.ఈ.చైర్మన్ వ్యాస్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. మణుగూరు హెవీవాటర్ ప్లాంట్ లో తయారైన హెవీ వాటర్ నుంచి బై ప్రోడక్ట్ దీన్ని తీస్తారు.
ఓ-18 ప్లాంట్లు ఇప్పటివరకు చైనా,ఆస్ట్రేల్రియా,అమెరికా,రష్యా,ఇజ్రాయిల్ ఈ ఐదు దేశాల్లో మాత్రమే ఉన్నాయి. 6వ ప్లాంటు-ను దేశంలో మణుగూరు హెవీ వాటర్ ప్లాంట్లో నెలకొల్పారు. మణుగూరులో ఓ-18 ప్లాంటును ఏర్పాటు చేయడంతో భారతదేశం కూడా ప్రపంచ దేశాల సరసన చేరింది.